జగన్ అరెస్ట్కు మూడుసార్లు ప్రయత్నించిన సిబిఐ?
శనివారం ఛార్జీషీట్ దాఖలు దాఖలు చేసిన తర్వాత అరెస్టు ఉంటుందేమోననే అనుమానంతో జగన్ వర్గంలోని మేనేజర్లు, ఆయన మద్దతుదారులకు వెంటనే గుంటూరులో ఓదార్పు యాత్ర చేస్తున్న జగన్ వద్దకు వెళ్లి ఆయన చుట్టూ వలయంలో ఏర్పడాలని సూచించారట. వచ్చే వారం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ ఓదార్పు యాత్ర ఉంటుంది. అక్కడ కూడా పెద్ద ఎత్తున మద్దతుదారులతో జగన్ ఓదార్పు నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో జగన్ను అరెస్టు చేసేందుకు సిబిఐ యత్నించిందట. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఫంక్షన్కు జగన్ జనవరిలో వచ్చారు. అతడు తిరిగి వెళ్లే సమయంలో అరెస్టు చేసేందుకు సిబిఐ ప్రయత్నించిందట. అయితే ఈ విషయం తెలుసుకున్న జగన్ తన షెడ్యూల్ను మార్చుకున్నారట. గత నెల మార్చి నాలుగో తేదిన కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు జగన్ వస్తున్నాడని తెలిసి సిబిఐ మరోసారి ప్రయత్నించినప్పటికీ ఆ విషయాన్ని తెలుసుకున్న జగన్ దానిని రద్దు చేసుకున్నారని పేర్కొంది.