బొత్స వద్దు కిరణే ముద్దు: రూటుమార్చిన చిరు?
అంతేకాకుండా కాకుండా బొత్సతో ఉంటే ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతగా మిగిలిపోతాననే భావన ఆయనలో కనిపిస్తోందని అంటున్నారు. ఇలా అయితే తన రాజకీయ జీవితానికే ప్రమాదమని చిరంజీవి భావిస్తున్నారని అంటున్నారు. మరోవైపు తన వర్గం నేతలకు పార్టీలో సరైన న్యాయం చేయాలంటే కిరణ్తో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని ఆయన భావించినట్లుగా సమాచారం. బొత్సతో ఉన్నప్పుడు తన వర్గానికి ఏమీ చేయలేక పోయానని, మంత్రి పదవులు అధిష్టానం హామీ మేరకే వచ్చినప్పటికీ, కిరణ్తో సఖ్యత లేకపోవడం వల్ల తన వర్గానికి చెందిన మంత్రులకు కోరిన శాఖలు ఇప్పించుకోలేక పోయానని ఆయన భావిస్తున్నారని అంటున్నారు. ఆ తర్వాత మాత్రం చిరంజీవి సమాచార హక్కు చట్టం కమిషనర్ల జాబితాలో తాను సిఫార్సు చేసిన వారి పేర్లు చోటు చేసుకోవడం, మేడారం జాతరకు ముఖ్యమంత్రితో కలిసి వెళ్లడం వంటి సందర్భాలను గుర్తు చేస్తున్న రాజకీయ పరిశీలకులు చిరంజీవి క్రమంగా సిఎంకు దగ్గరవుతున్నారని అంటున్నారు.
మరోవైపు కిరణ్ కూడా తనకు చిరంజీవి సహకారం అవసరమని భావిస్తున్నారని అంటున్నారు. చిరంజీవికి జనంలో ఉన్న గ్లామర్, పార్టీ నాయకత్వం ఆయనకు ఇస్తున్న ప్రాధాన్యం, వీటికి మించి చిరు సమన్వయ కమిటీలో సభ్యుడిగా ఉన్నందున ఆయనతో సఖ్యతగా ఉండటమే మంచిదని కిరణ్ యోచిస్తున్నారట. చిరుతో విభేదిస్తే సాధించేది ఏమీ ఉండదని, అందుకే ఆయనకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారట. చిరంజీవి తన వైపు ఉంటే బొత్స ప్రాధాన్యత తగ్గుతుందని కూడా ఆయన భావిస్తున్నట్లుగా సమాచారం.