ఓటమి ఎఫెక్ట్: రంగంలోకి సోనియా?

రాష్ట్రంలో సీనియర్లతో సమన్వయం సరిగా లేదని, ఇదే ప్రధాన లోపమని, అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం లేదని, ఇదే పార్టీకి నష్టం చేకూరుస్తుందని, ఇక నేనే రంగంలోకి దిగుతానని, సమన్వయం ఉండేలా చూడాల్సిన బాధ్యత స్థానిక నేతలపైనా ఉందని ఆమె అన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై దృష్టి సారించాల్సి ఉందని చెప్పారని తెలుస్తోంది. అదే సమయంలో త్వరగా కఠిన చర్యలు తీసుకోకపోతే లాభం ఉండదని కావూరి, త్వరలో మరో 18 స్థానాల్లో కూడా ఉప ఎన్నికలు ఉన్నాయని, పార్టీని బలోపేతం చేసేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని మాగుంట సోనియాకు సూచించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె కలిసి కార్యాచరణపై చర్చిద్దామని చెప్పారని తెలుస్తోంది. ప్రత్యేక సెంటిమెంట్ దృష్ట్యా ఈ ఎన్నికలు జరిగినందున వీటిని వదిలేసి, వచ్చే పద్దెనిమిది నియోజకవర్గాల ఉప ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని సోనియా వారికి సూచించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications