గుర్తుపై చిరు మెగా ఆందోళన

గుర్తు కోసం ప్రజారాజ్యం న్యాయపోరాటం చేయటం మాట ఎలా ఉన్నా ఉమ్మడి చిహ్నం రాకపోతే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటన్న ఆందోళన పార్టీ శ్రేణులను ఇప్పటినుంచే వెంటాడుతున్నది. ఉమ్మడి గుర్తు రాకపోతే ఎన్నికల్లో అతి బలమైన కాంగ్రెస్, మహాకూటమిని ఎదుర్కోవటం కష్టసాధ్యం అని ఇప్పటికే వారు నిర్ణయానికి వస్తున్నారు. ఉమ్మడి గుర్తు లేకుండా అన్ని స్థానాలకు పోటీ చేస్తే పార్టీతో నిమిత్తం లేకుండా స్వంత బలం, బలగం, అర్థబలం ఉన్న ఏ కొద్దిమందికో మాత్రమే అవకాశం ఉంటుందని, కాంగ్రెస్ను ఓడించి అధికారం పగ్గాలు చేపట్టాలనే చిరంజీవి కోరిక నెరవేరటం అంత సులభం కాదని ఇప్పటికే పలువురు నేతలు బహిరంంగా మాట్లాడుతున్నారు.
అదీ కాక తమ పార్టీ తరఫున అభ్యర్థులుగా ఉండబోయే వారు నిష్కళంకులుగా, ప్రజాసేవ పరమార్థంగా కలిగిన వారుగా, నేర చరిత్ర లేని వారుగా ఉండాలని ప్రజారాజ్యం మొదటినుంచీ చెబుతున్నది. అలాంటి వారు ఉన్నా, ఉమ్మడి గుర్తు రాకపోతే వారి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న పిఆర్పీ నేతల మధ్య చర్చనీయాంశంగా మారింది. 2004 ఎన్నికల్లో టిఆర్ఎస్కు ఉమ్మడి గుర్తు లభించి, కాంగ్రెస్తో పొత్తులో బరిలో దిగినా ఆపార్టీ పోటీ చేసిన స్థానాల్లో సగానికి పైగా మాత్రమే గెలవటాన్ని పిఆర్పీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications