కుప్పం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరు శిబిరంలో పెను ఆశలు

By Staff
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
చిరంజీవి రాజకీయ నాలెడ్జి రోజు రోజుకీ పెరిగిపోతోంది. జిల్లాల వారీగా ఆయన ప్రజారాజ్యం సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అభ్యర్ధుల నుంచి సమాచారం తీసుకుని ఆయన నోట్స్ రాసుకుంటున్నారు. దానికి తన అబ్జర్వేషన్ లను జోడించి ఫైనల్ నివేదికలను తయారు చేసుకుంటున్నారు. ప్రజారాజ్యం 160 సీట్ల మేజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉండడంతో ఆయన శిబిరంలో ఉత్సాహం ఉరకలు వేస్తోంది. ఇక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారమే తరువాయి అన్నట్టుగా ఉంది వ్యవహారం. సమీక్షా సమావేశాలకు హాజరైన అభ్యర్ధులందరూ గెలుపుపై ఆశతో ఉండడం విశేషం. ఓడిపోతామని ఏ ఒక్కరూ చెప్పలేదంట.

చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఐదువేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని అక్కడి ప్రజారాజ్యం అభ్యర్ధి, చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు రాజేంద్రబాబు చెప్పడంతో చిరంజీవి ఆశ్చర్యపోయారు. నిజమే చెబుతున్నావా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జిల్లా కడపలో ఐదు స్ధానాల్లో గెలుస్తామని పీఅర్పీ అభ్యర్ధులు చెప్పారు.

ఇలా ఉండగా తెలుగుదేశం మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి జోస్యం ప్రకారం ప్రజారాజ్యం పార్టీకి 26 అసెంబ్లీ స్ధానాలు, రెండు లోక్ సభ సీట్లు వస్తాయి. టిడిపి కూటమికి 199 స్ధానాలు, కాంగ్రెస్ కు 54 స్ధానాలు వస్తాయి. మోహన్ రెడ్డి న్యూమరాలజిస్టు అన్న విషయం తెలిసిందే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X