చిరు శిబిరంలో పెను ఆశలు
చిత్తూరు జిల్లా కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఐదువేల ఓట్ల మెజారిటీతో గెలుస్తానని అక్కడి ప్రజారాజ్యం అభ్యర్ధి, చిరు ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు రాజేంద్రబాబు చెప్పడంతో చిరంజీవి ఆశ్చర్యపోయారు. నిజమే చెబుతున్నావా అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జిల్లా కడపలో ఐదు స్ధానాల్లో గెలుస్తామని పీఅర్పీ అభ్యర్ధులు చెప్పారు.
ఇలా ఉండగా తెలుగుదేశం మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి జోస్యం ప్రకారం ప్రజారాజ్యం పార్టీకి 26 అసెంబ్లీ స్ధానాలు, రెండు లోక్ సభ సీట్లు వస్తాయి. టిడిపి కూటమికి 199 స్ధానాలు, కాంగ్రెస్ కు 54 స్ధానాలు వస్తాయి. మోహన్ రెడ్డి న్యూమరాలజిస్టు అన్న విషయం తెలిసిందే.
Comments
Story first published: Saturday, May 2, 2009, 11:18 [IST]