వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కాంగ్రెస్ హైకాండ్ ను జగన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?
జగన్ వైయస్ కు కొడుకు మాత్రమే కాదని, గొప్ప శిష్యుడని రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అభివృద్ధి చేయగల దార్శనికుడు జగన్ ఒక్కడేనని వార్తాకథనాలు సాక్షి మీడియాలో వస్తున్నాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న తరుణంలో జగన్ మాత్రమే పరిస్ధితిని అదుపులోకి తెస్తారన్న వాదనను హైకమాండ్ వద్ద జగన్ వర్గం విన్పిస్తోంది. రేపు జగన్ ఒక ముఖ్యమైన సంగతిని రాష్ట్ర ప్రజలకు అందించనున్నారని కూడా జగన్ బంధువులు జనంలోకి వదులుతున్నారు. జగన్ సొంతంగా పార్టీ పెట్టుకుంటే రాణించగలరా? ఆయన వాపును బలుపు అనుకుంటున్నారా? త్వరలో చాలా విషయాలు బయటికి వస్తాయి.
Comments
Story first published: Monday, December 21, 2009, 9:25 [IST]