బెల్లంకొండ కొత్త గొడవ
ఇక ఇవన్నీ ఇలా ఉంటే ఒక ఊరిలో(తరుణ్,సలోని)చిత్రాన్ని డైరక్ట్ చేసిన రమేష్ వర్మ..బెల్లంకొండ సురేష్ కి రైడ్ పేరుతో బైక్ చుట్టూ తిరిగే కథ చెప్పి ఒప్పించుకున్నారు. బైస్కిల్ థీఫ్ ఆధారంగా రూపొందిన బీజింగ్ భైస్కిల్ అనే చిత్రం ఆధారంగా ఈ కథ తిరుగుతుందని సమాచారం. అయితే ఫొల్లాదవాన్ కూడా బైస్కిల్ ధీప్ ఆధారంగా రూపొందిన చిత్రమే కావటంతో ఈ తలనొప్పి వచ్చింది. పొల్లాదవాన్ కథ ప్రకారం హీరో ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. తండ్రిని ఒప్పించుకుని ఒక పల్సర్ బండి కొనుక్కుంటాడు. ఆ బండిని లోకల్ మాఫియా వాళ్ళు మిస్ చేస్తారు. అక్కడ నుండి ప్రాణపదంగా చూసుకుంటున్న ఆ బండికోసం వేట మొదలవుతుంది. ఆ క్రమంలో ఆ మాఫియా వాళ్ళతో తగువుఅవుతుంది. ప్లాష్ బ్యాక్ నేరేషన్ లో కధ సాగుతుంది. ఇక బైస్కిల్ ధీప్ లో సైకిల్ మిస్సయితే దాని కోసం వెతుకులాటని ఇలా మార్చి వాళ్ళు చేసారు. దాన్ని జెమినీ వారు రైట్స్ కొన్నారు.
ఇక జెమినీ కిరణ్ ఈ కాపీ వార్త తెలిసి వెంటనే రమేష్ వర్మని పిలిచి కథ వినపించమన్నారని తెలుస్తోంది. అయితే ఆ కథ..ఈ కథ వేరుని, అయినా ఇటువంటి విషయాలు తమ నిర్మాతతో డీల్ చేస్తే మేలని సున్నితంగా చెప్పినట్లు సమాచారం. నిజానికి ఎంతో డబ్బు పోసి కొన్న సినిమా కథతో మరొకరు సినిమా చేస్తున్నారు అంటే చిరాకుపుట్టే అంశమే. అయితే అదీ బైస్కిల్ ధీప్ నుండి ఇన్సిఫైర్ అయిన కథ కావటంతో ధీఫ్ ఎవరనేది గుర్తించటం కష్టమే.