వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రామోజీ మౌనం!

By Staff
|
Google Oneindia TeluguNews

Ramoji Rao
రామోజీరావును "సాక్షి" పత్రిక తెలుగుదేశం పార్టీకి రాజగురువుగా అభివర్ణిస్తూ వస్తోంది. తెలుగుదేశం అధికారంలోకి రాని నేపధ్యంలో ఆ రాజగురువు ఇప్పుడు ఏం చేస్తున్నట్టు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనను సంప్రదించడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా పలకరించడం లేదట. వాడుకుని వదిలేస్తారన్న పేరు చంద్రబాబుకు ఉంది. ఆ విషయంలో వైఎస్ చేసిన విమర్శలు పబ్లిక్ లోకి బాగా వెళ్ళాయి. వైఎస్ తనను నమ్ముకున్నవారిని మరిచిపోరని పేరుంది. విశ్వనీయతను ఆయన అక్కడి నుంచే తెచ్చుకున్నారు.

రామోజీరావును కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందుల పాలు చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్ ముఖ్యమంత్రి కాకపోతే బాగుంటుందని రామోజీ అనుకున్నారు. మహాకూటమిని ఆయనే ఏర్పాటు చేయించినా మహాఓటమి తప్పలేదని కాంగ్రెస్ మేధావులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆంధ్రజ్యోతి, ఈనాడు, సూర్య పత్రికలు కాంగ్రెస్ మీద చాలా బ్యాలెన్స్ డ్ గా వ్యవహరిస్తున్నాయి. ఈ సంయమనం ఎంత వరకో ఇంకా స్పష్టం కాకుండా ఉంది. చంద్రబాబు నాయుడు మహాకూటమి ఓటమి తర్వాత వివరంగా ప్రెస్ ముందుకు రాలేదు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X