వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైఎస్ కు సొంత పార్టీ నుంచే ముప్పు!

By Staff
|
Google Oneindia TeluguNews

YS Rajasekhar Reddy
కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినప్పటికీ పూర్తిగా ఐదేళ్ళు అధికారంలో వైఎస్ ఆర్ ఉండి కొందరు అరుదైన నాయకుల జాబితాలో చేరారు. సాధారణంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులను పదవీకాలం ముగియకముందే మార్చేయడం జరుగుతుంటుంది. పివి నరసింహారావు వంటి వారికే ఆ ఇబ్బంది తప్పలేదు. ఆ విషయంలో వైఎస్ అదృష్టవంతుడు. ఆ ఒక్క విషయంలోనే కాదు, ఆయనకు ప్రయోజకుడైన కొడుకు ఉండడం మరో అదృష్టం. ఆ కుమారుడి వ్యాపార సామర్ధ్యం తెలుసుకుని కొన్ని కంపెనీలు వేలాది కోట్ల రూపాయలు ఆయన మీడీయాలో, పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టడం ఇంకా అదృష్టం.

వైఎస్ దురదృష్టమంతా కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యేల ద్వారానే. గత ఎన్నికల్లో తనకు ఇష్టం లేని అభ్యర్ధులు కూడా వివిధ మార్గాల ద్వారా టికెట్లు తెచ్చుకుని కాంగ్రెస్ అభ్యర్ధులుగా గెలుపొందారు. ఈసారి 294 మందికీ తన చేతి మీదగానే టికెట్లు ఇవ్వాలని వైఎస్ పట్టుదలగా ఉన్నారు. అయితే టికెట్లు రాని సిటింగ్ ఎమ్మెల్యేలు వైఎస్ మీద పడగెత్తడానికి సిద్ధంగా ఉన్నారు. వైఎస్ సొంత మనుషులను ఓడించడానికి వారు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ ముఖ్యమంత్రి కాకపోయారంటే అందుకు కారణం సొంత పార్టీ వారే అవుతారు. ఆ విషయం వైఎస్ కు బాగా తెలుసు. అయితే ఆయన జగమొండి. ఏది జరిగితే అది జరగనివ్వండి అని అనుకునే రకం. ఏం జరుగుతుందో రెండు నెలల్లోపే తేలిపోతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X