వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చిరంజీవి లేఖ వల్లనే అన్ని కొత్త రైళ్ళు వచ్చాయా?
చిరంజీవి ఈ రైళ్ళు ప్రారంభించాలని బడ్జెట్ కు ముందు మమతా బెనర్జీకి లేఖరాశారట. చిరంజీవి మీద ఆమె మమత చూపించి ఈ రైళ్ళను ప్రకటించారని ప్రచారం జరుగుతోంది. దేశంలోనే అతి పెద్ద పర్యాటక కేంద్రమైన తిరుపతికి వచ్చే యాత్రికుల సంఖ్యను దృష్టిలో పెట్టుకునే మమత ఈ మంచి పని చేసినట్టు కన్పిస్తోంది. ఇందులో చిరంజీవి గొప్పతనమేమీ లేదని, ఒక ఎమ్మెల్యే లేఖ మీద ఇంత పెద్ద పనులు జరగవని కాంగ్రెస్ ఎంపీ చింతా మోహన్ మనుషులు అంటున్నారు. చింతామోహన్ మమతా బెనర్జీని అనేకసార్లు కలుసుకుని ఈ పనులు చేయించారని వారు చెబుతున్నారు. తాను చేసిన కృషిని చింతామోహన్ కూడా పత్రికా ముఖంగా వివరించారు. మరి చిరంజీవి ఏమంటారో?
Comments
Story first published: Thursday, February 25, 2010, 12:02 [IST]