వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిత్యానంద గోల్డ్ స్మగ్లరా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Nityananda Swami
తీగలాగితే డొంక కదిలినట్టుగా ఉంది నిత్యానంద స్వామి వ్యవహారం. నాలుగు రోజుల ఇంటరాగేషన్ లో సిఐడి అధికారులకు అనేక ఆసక్తికరమైన విషయాలు తెలిసినట్టు కన్పిస్తోంది. అయితే వాటిని ఈ దశలో వెల్లడించడానికి వారు సిద్ధంగా లేరు. నిత్యానందకు అమెరికాలో రెండు ఆశ్రమాలున్నాయి. అక్కడి నుంచి వచ్చి వచ్చే సమయంలో తనతో బంగారు ఆభరణాలను అక్రమంగా భారత్‌కు తీసుకువచ్చేవారని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. నిత్యానంద వ్యక్తిగత కార్యదర్శి నిత్య గోపిక సహకారంతో ఆయన ఎక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలను భారత్‌కు తీసుకువచ్చేవారని డిఆర్‌ఐ అధికారులు అనుమానిస్తున్నారు.

మరో వారం రోజుల పాటు నిత్యానందనను విచారణ నిమిత్తం తమ అదుపులోనే ఉంచాలని న్యాయమూర్తిని పోలీసులు కోరే అవకాశం ఉంది. బుధవారం సాయంత్రం వరకు నిత్యానందను పోలీసులు విచారణ చేయనున్నారు. ఇప్పటి వరకు జరిగిన విచారణలో నిత్యానంద వెల్లడించిన అంశాలను పోలీసులు బహిరంగ పరచలేదు. కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని, వివరాలను ప్రస్తుతం వెల్లడించలేమని సిఐడి అధికారులు తెలిపారు. విచారణ చురుకుగా కొనసాగేందుకు పోలీసులకు తీగ దొరకాల్సి ఉంది. అప్పుడే నిత్యాందుని డొంక కదులుతుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X