వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై హైకమాండ్ రోశయ్యను సంప్రదిస్తుందా?

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి సంబంధించినంత వరకు రోశయ్య ఉత్సవ విగ్రహమేనన్న అభిప్రాయం కలుగుతోంది. తెలంగాణపై కేంద్ర హోంమంత్రి చిదంబరం చేసిన రెండు ప్రకటనలు రోశయ్యను సంపదించకుండానే వెలువడ్డాయన్న వార్తలు వచ్చాయి. రోశయ్య మాత్రం హైకమాండ్ ఏలా చెబితే అలా నడుచుకుంటానని ఏకవాక్య ప్రకటనలు చేస్తున్నారు. 28లోపు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై ఒక ప్రకటన చేయాలని జెఎసి గడువు విధించిన నేపధ్యంలో వచ్చే వారం రోజుల్లో ప్రతి గంటా ఉత్కంఠ భరితమే.

రోశయ్య ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడలో పర్యటించవలసి ఉంది. ఆ కార్యక్రమం అధికారికంగా ఖరారైనప్పటికీ ఒక మెలిక ఉంది. ఈసారి రోశయ్యను తెలంగాణ విషయంలో కేంద్రం సంప్రదించే అవకాశముందని తెలుస్తోంది. ఆయనను 27న ఢిల్లీ పిలిపించుకుని, ఆయన అభిప్రాయాన్ని తెలుసుకుని అధి నాయకులు చర్చించుకోవచ్చు. ఈసారి రోశయ్య అభిప్రాయానికి, అనుభవానికి కొంత విలువ ఇచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. "మీరు ఎలా చెబితే అలా" అనకుండా రోశయ్యను తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పమని సోనియా గాంధీ తదితరులు నిలదీయవచ్చు. అప్పుడు రోశయ్య ఏం చెబుతారు? తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినని చెబుతారు. ఆ పదవిలో ఎవరున్నా అదే చెబుతారు. సీటు మహత్యమంటే అదే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X