వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భూ వివాదంలో 'వరుడు'

By Pratap
|
Google Oneindia TeluguNews

Allu Arjun
రెండు రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్న వరుడికి కష్టాలొచ్చి పడ్డాయి. తెలుగు హీరో అల్లు అర్జున్ భూవివాదం కేసు మళ్లీ ముందుకు వచ్చింది. అల్లు అర్జున్ కొనుగోలు చేసిన భూవివాదంపై విచారణ చేపట్టాలని స్థానిక కోర్టు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీసులను ఆదేశించింది. అల్లు అర్జున్ 4 ఎకరాల భూమిని ఆక్రమించుకున్నారంటూ న్యాయవాది రాహుల్ దేవ్ కొన్ని నెలల క్రితం కోర్టులో ఫిర్యాదు చేశారు. దానిపై కోర్టు విచారణకు ఆదేశించింది. తాము విచారణ చేపట్టామని, నివేదికను కోర్టు అందిస్తామని నార్సింగి పోలీసులు చెబుతున్నారు.

కాగా, అల్లు అర్జున్, అల్లు నిర్మల, అల్లు శిరీష్, వసంత లక్ష్మి 2004లో ముస్తాఫాఖాన్ నుంచి 14 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే, వారు కొన్నది 10 ఎరకాల 4 గుంటలు మాత్రమేనని, తాను ముస్తాఫాఖాన్ నుంచి కొన్న నాలుగు ఎకరాలను ఆక్రమించుకున్నారని రాహుల్ దేవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని రాహుల్ దేవ్‌పై అల్లు అర్జున్ ఎదురు ఫిర్యాదు చేశారు. సివిల్ దావా అంటూ పోలీసులు దాన్ని పక్కన పెట్టేశారు. దాంతో రాహుల్ దేవ్ కోర్టుకు వెళ్లారు.

English summary
Tollywood hero Allu arjun land dispute case came into fore, when he is going to marry within two days. Local court ordered to Narsingi police of Cyberabad commissioner ate to enquire into Allu Arjun's land dispute issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X