తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెర్రీ రిసెప్షన్: తిరుపతి ప్రజల కోసం చిరు ఆరాటం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chiranjeevi
తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి తన నియోజకవర్గ ప్రజల మనసులు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి మూడేళ్లు దాటినా చిరంజీవికి అవి ఒంటబట్టలేదనే కామెంట్ ఉంది. అయితే క్రమంగా చిరంజీవి కూడా రాజకీయాలు ఒంటబట్టించుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తన నియోజకవర్గ ప్రజల మనుసులు గెలుచుకునేందుకు ఆయన ఇటీవల జోరుగా అక్కడ పర్యటించారు. అక్కడి అభివృద్ధి పనులపై కూడా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

2014 ఎన్నికలలో తాను ప్రత్యేకంగా కనిపించాలంటే తన ఇమేజ్‌తో పాటు తాను ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసి, వారి మనసులు చూరగొంటేనే రాష్ట్రంలో గట్టిగా నిలబడగల్గుతామని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆయన తన తనయుడు రామ్‌చరణ్ తేజ రిసెప్షన్‌ను తిరుపతిలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారనే వాదనలు వినిపిస్తున్నాయి. తన నియోజకవర్గ ప్రజలకు తాను అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాననే విశ్వాసం కలిగించడానికే చెర్రీ పెళ్లి విందును తిరుపతిలో ఏర్పాటు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.

English summary
Though his take off was filled with criticism and humiliations, Chiranjeevi seems to be stabilizing himself in the field of politics slowly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X