అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుతో కలిసి జెసి ప్రతీకారం?

By Pratap
|
Google Oneindia TeluguNews

JC Diwakar Reddy
కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికే సిద్ధపడినట్లు కనిపిస్తున్నారు. అనంతపురం జిల్లా నుంచి తన ప్రత్యర్థులు రఘువీరా రెడ్డి, శైలజానాథ్‌లను మంత్రివర్గంలోకి తీసుకుని తనకు మొండిచేయి చూపిన ముఖ్యమంత్రిపై ప్రతీకారం తీర్చుకోవడానికి జెసి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుతో రహస్య అవగాహన కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డికి షాక్ ఇవ్వడానికి ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే నీతిని జెసి పాటించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెట్టు గోవింద రెడ్డిని బలపరుస్తున్నట్లు సమాచారం.

అనంతపురం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జెసికి చెందిన ప్రజాప్రతినిధులు 52 మంది గోవింద రెడ్డికి ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు పార్టీకి 26 ఓట్ల మెజారిటీ మాత్రమే ఉంది. అయితే, జెసి వర్గానికి చెందిన 52 మంది క్రాస్ ఓటింగుకు పాల్పడితే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయం. ఇప్పుడు అదే జరిగే పరిస్థితులు నెలకొన్నాయి. ఆ మధ్య జెసి దివాకర్ రెడ్డి శాసనసభ ఆవరణలో చంద్రబాబును కలుసుకోవడం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ ఒప్పందం కోసమే ఆయన చంద్రాబబుతో సమావేశమైనట్లు ఇప్పుడు అర్థమవుతోంది.

English summary
It is said that Congress MLA JC Diwakar Reddy has decided to take revenge against CM Kiran Kumar Reddy. It is learnt that JC Diwakar Reddy followers may vote for TDP candidate Mettu Govind Reddy in Anantapur MLC election.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X