కెసిఆర్ నిర్ణయానికి తనయుడి బ్రేక్

కెసిఆర్ హామీని ఆయన తనయుడు, శాసనసభ్యుడు కెటి రామారావు కొట్టిపారేసినట్లు చెబుతున్నారు. విలీనంపై కెసిఆర్తో కెటిఆర్ తీవ్రంగా విభేదించారని వినికిడి. తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తే తన రాజకీయ ఉనికి దెబ్బ తింటుందని కెటి రామారావు భయపడుతున్నారట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెరాస పగ్గాలను తన చేతుల్లోకి తీసుకుని ధూమ్ధామ్ రాజకీయాలు నడపాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కాంగ్రెసులో తమ పార్టీని విలీనం చేస్తే కాంగ్రెసు నాయకుల్లో తాను ఒకడు కావాల్సి వస్తుంది. విలీనం చేయలేకపోతే తెరాసలో తానొక్కడే అంతా అయి రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చునని కెటిఆర్ ఉత్సాహపడిపోతున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications