గులాబీ దండులోకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు?
ఇటీవల ఆయన ఫామ్హౌస్లో మాకం వేసింది ఆ ఇద్దరు శాసనసభ్యులతో చర్చలు జరపడానికేనని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఆ ఇద్దరి గురించిన వివరాలు బయటకు తెలియకుండా తెరాస జాగ్రత్త పడుతోందని అంటున్నారు. గత శాసనసభ ఎన్నికల్లో తెరాస కేవలం పది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. తెలుగుదేశం పార్టీకో కట్టిన పొత్తు వికటించి ఉన్న స్థానాలను కూడా జార విడుచుకుంది.
అయితే, ప్రస్తుతం ఆ పార్టీ బలం శానససభలో 17కు పెరిగింది. మరో అనుబంధ సభ్యుడు సోమారపు సత్యనారాయణ కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు, కాంగ్రెసుకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు ఆ పార్టీలకు, శానససభ్యత్వాలకు రాజీనామా చేసి తెరాసలో చేరారు. ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేసి విజయం సాధించారు.
తెలంగాణ ఉద్యమం కారణంగా చాలా మంది తెరాసలో చేరుతారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, చాలా మంది వేచి చూసే ధోరణిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా తెరాస దూకుడుకు కొంత కళ్లెం వేసినట్లు భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసులో కూడా చేరే వెసులుబాటు ఉండడంతో తెరాసలో చేరే విషయంలో కొంత మంది ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.