Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైయస్ జగన్ పర్యటనలో సిబిఐ దడ?

YS Jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో సిబిఐ దర్యాప్తు ప్రభావం కనిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన మంగళవారంనాడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో పర్యటించారు. సిబిఐ తీసుకునే నిర్ణయం ఎలా ఉంటుందోననే ఆందోళన జగన్ పర్యటనలో స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. నరసన్నపేటలో మండపాం నియోజకవర్గం నుంచి ఆయన పర్యటన ప్రారంభించారు.

వైయస్ జగన్ ఎప్పటికప్పుడు తన పర్యటన కార్యక్రమాన్ని మార్చుకున్నారు. కొన్ని గ్రామాల్లో పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన ఎక్కువగా జనం మధ్యన ఉండడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. రెండో రోజు పర్యటనలో ఆయన అలసటగా కనిపించినట్లు స్థానిక మీడియా వ్యాఖ్యానిస్తోంది. పర్యటనలో గ్రామానికి గ్రామానికి మధ్యన కాన్వాయ్‌ని ఆపేసి సుదీర్ఘంగా సెల్‌లో ఆయన మాట్లాడుతున్నారు.

వైయస్ జగన్ పర్యటనలో ప్రసంగాలు కూడా అంత దాటిగా లేవని అంటున్నారు. పర్యటన చివరలో పర్యటనను కుదించి రాత్రి బసను అప్పటికప్పుడు మార్పు చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. గుంటూరుకు చెందిన పూసపాటి నాగేశ్వర రావు పైలట్ వర్క్ చేస్తూ ప్రజల హాజరును ఎప్పటికప్పుడు జగన్‌కు తెలియజేస్తున్నారట. ప్రజలు దండిగా ఉన్నారని తెలుసుకున్న తర్వాత నేరుగా వేదిక వద్దకు వెళ్లి మాట్లాడుతున్నారని అంటున్నారు.

ప్రజలు ఎక్కువగా లేకపోతే గ్రామం వెలుపల కాన్వాయ్‌ని ఆపు చేసి ఆ తర్వాత వెళ్తున్నారని చెబుతున్నారు. ఏమైనా, సిబిఐ విచారణ ప్రభావం జగన్ పర్యటనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని అంటున్నారు. ఆందోళన చాప కింద నీరులా పరుచుకున్నట్లు చెబుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+