చిరుకు సిఎం యోగం, విజయమ్మ విజయఢంకా?
ఈ ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఘోరంగా ఓడిపోతాయట. ఆదివారం విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ పీఠాధిపతి ఆ విషయాలు చెప్పారు. రాష్ట్రంలో వైఎస్ విజయమ్మ విజయదుందుభి మోగించి, రాష్ట్ర పగ్గాలు చేపడతారని అయ్యన్న పంతులు చెప్పారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈ డిసెంబర్లో జైలు నుంచి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల పవనాలు వీచడం లేదని చెప్పారు. రాజకీయ సంక్షోభాలు, తెలంగాణ అల్లర్లు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తాయని ఆయన చెప్పారు.
ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ స్థానే చిరంజీవి కొద్ది మాసాలు సిఎం అయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమని అన్నారు. ఈ సంవత్సరాంతం వరకూ రవాణా మార్గాల్లో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, విశాఖ రిఫైనరీలో కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉందని అయ్యన్న పంతులు తెలిపారు.