రావణుడే దేవుడు, తిరగరాస్తారా...

తాజాగా, రావణుడిని వర్ధంతిని జరిపే విషయంపై ఆయన మాట్లాడారు. రావణుడి చరిత్రను తిరగ రాసి పాఠ్యాంశాల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రాహ్మణులు, క్షత్రియులు కుట్రపన్ని వక్రీకరించి, రావణుడిని రాక్షసుడిగా వక్రీకరించారని ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో బహుజనసేన ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రావణుడి వర్ధంతి సభలో ఆయన మాట్లాడారు.
రావణుడితో పాటు బలిచక్రవర్తి, శూర్పణఖ, నరకాసురుడు నీతిపరులని ఆయన కితాబిచ్చారు. ఇతరులను రాజ్యాలను వారెవరు దోచుకోలేదని, ప్రజలకు ఆదర్శవంతమైన పాలనను అందించి పురాణాల్లో నిలిచిపోయారని ఐలయ్య అన్నారు.
సభలో విమర్శకుడు సురేందర్ రాజు, బహుజన నేత కదిరె కృష్ణ, రచయిత కొత్త శివమూర్తి, మేకపోతుల నరేందర్గౌడ్, మంచాల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. విమర్శకుడు సురేందర్ రాజు అసురగా ప్రసిద్ధుడు. ఆసుర అంటే రాక్షసుడు. రాక్షసులను క్రూరులుగానూ నరమాంస భక్షకులుగానూ చిత్రీకరించారని ఆయన వాదిస్తారు. ద్రవిడులను రాక్షసులుగా చిత్రీకరించి చరిత్రను వక్రీకరించారని దళిత బహుజనులు వాదిస్తున్నారు. ఏమైనా, వారు వీరు కావడం అనేది కూడా చరిత్రలో భాగమేమో.












Click it and Unblock the Notifications