వైయస్ జగన్ వర్గం నేత సబ్బం పబ్బం
ఆ వ్యవహారంపై ఏకంగా ఆజాద్తో హనుమంతరావు మాట్లాడారని, నిరసన వ్యక్తం చేశారనీ తెలిసింది. జగన్ పార్టీ కూడా ప్రణబ్కే మద్దతు ఇచ్చింది కాబట్టి సరిపోయింది కానీ, ఆ పార్టీ అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుని ఉంటే, అప్పుడు కూడా సబ్బం సాంకేతికంగా కాంగ్రెస్ సభ్యుడన్న సాకుతో ఫోన్ చేసే వారేనా అని ప్రశ్ని స్తున్నారు. ఉండవల్లి అరుణ్కుమార్, హర్ష కుమార్, లగడపాటి రాజగోపాల్ లాంటి పార్లమెంటు సభ్యులు సైతం సబ్బం హరి పట్ల తమ నాయకత్వం అనుసరిస్తున్న వైఖరిని జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.
కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలలో ఒకరైన ఆజాద్ అలా వ్యవహరిస్తే అదే రాష్టప్రతి ఎన్నిక సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అందుకు భిన్నంగా వ్యవహరించారు. జగన్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలు ఆళ్ళ నాని, రాజా సుజయ కృష్ణ రంగారావుకు ముఖ్యమంత్రి నుంచి కానీ, పీసీసీ నుంచి కానీ ఎలాంటి ఫోన్లు వెళ్ళలేదు. వారిని వోట్లు అర్థించలేదు. వారిప్పుడు సాంకేతికంగా తమ ఎమ్మెల్యేలే అయినా జగన్ శిబిరానికి ఫిరాయించారు కాబట్టి వారికి ఫోన్లు చేసేది లేదని, వారు ఇష్టం వచ్చిన వారికి వోట్లు వేసుకోవచ్చునని బొత్స బాహాటంగానే స్పష్టం చేశారు.
సబ్బం హరి రెండు పార్టీలో కొనసాగుతుండడం చాలా మందికి మింగుడు పడడం లేదు. ఒక సందర్భంలో ఆయనపై చర్య తీసుకుంటామని బొత్స ప్రకటిస్తే, తాను ఎంపీని కాబట్టి పిసిసికి ఆ అధికారం లేదని సబ్బం హరి జవాబిచ్చారు. ఇంత జరిగినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోకపోవడంలోని ఆంతర్యం అర్థం కాక చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు. బాహాటంగా పార్టీని విమర్శిస్తున్నా, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని తప్పు పడుతున్నా సబ్బం హరిపై చర్య తీసుకోకపోవడమేమిటనే ప్రశ్న పార్టీ వర్గాల నుంచే అధిష్టానానికి ఎదురవుతోంది.