ఏమవుతుందో!: అరెస్ట్‌పై జగన్ పార్టీలో ఆందోళన?

ys jagan
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సిబిఐ శనివారం ఛార్జీషీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సిబిఐ ఛార్జీషీట్ చేయడం ఆ పార్టీలో కలకలం సృష్టించిందని అంటున్నారు. ఛార్జీషీట్‌లో ఎ-1గా జగన్ పేరును పేర్కొనడం ఆ వర్గాలను కలవరపరుస్తోందంట. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందనే ఆందోళన వారిలో వ్యక్తమవుతోందని అంటున్నారు. ఎప్పుడు ఏం జరిగినా సిద్ధంగా ఉండాలని పార్టీ అధినాయకత్వం కింది స్థాయి నేతలకు ఇప్పటికే సంకేతాలు పంపిన విషయం తెలిసిందే. ఒకవేళ జగన్ విషయంలో అనుకోని పరిస్థితిలు ఎదురై అరెస్టు అయిన పక్షంలో పార్టీకి ఇబ్బంది ఏమీ లేదని, అప్పుడు పార్టీ పగ్గాలు ఆయన తల్లి, ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ చేపడతారనే వాదన ఇప్పటికే ఉంది.

అయితే సిబిఐ ఇప్పటి వరకు జగన్ అరెస్టు జోలికి వెళ్లకుండా శనివారం దాఖలు చేసిన ఛార్జీషీట్‌లో ఆయనను ఎ-1గా పేర్కొంది. దీనిపై పార్టీ ముఖ్య నేతలు బయటకు ఎంత చెబుతున్నా లోలోన గుబులు చెందుతున్నారని అంటున్నారు. వివిధ కారణాల వల్ల జగన్ అరెస్టు కాబోరని వారు భావిస్తున్నారని తెలుస్తోంది. అదే సమయంలో సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఆషామాషీగా ఛార్జీషీటును దాఖలు చేయదు కదా అనే ఆందోళనలో కూడా వారు ఉన్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+