వైయస్ వివేకాను ఎందుకు పక్కన పెట్టారు?

వైయస్ వివేకానంద రెడ్డిని రాజ్యసభకు పంపే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన పేరును పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయనను సంజీవ రెడ్డి స్థానంలో తీసుకుంటారని భావించారు. అయితే ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో సోనియా అదే సమాజిక వర్గానికి చెందిన మరో నేత కోసం రాష్ట్ర నేతలను అడిగారట. దీంతో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. అధిష్టానానికి విశ్వసనీయంగా ఉండటం, తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం, సీనియారిటీ ఉండటం ఇలా పలు అశాలను పరిగణలోకి తీసుకొని సోనియా గాంధీ పాల్వాయిని ఎంపిక చేశారు.












Click it and Unblock the Notifications