వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ వివేకాను ఎందుకు పక్కన పెట్టారు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
కాంగ్రెసు పార్టీ అధిష్టానం రాజ్యసభ పదవి విషయంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైయస్ వివేకానంద రెడ్డిని పక్కన పెట్టింది. సొంత కుంపటి పెట్టుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని కడప జిల్లాలో ఎదుర్కోవాలంటే కాంగ్రెసుకు వైయస్ వివేకానంద తప్పనిసరి. కడపలో ముప్పై ఏళ్లుగా వైయస్ కుటుంబానిదే ఆధిపత్యం. ఇప్పుడు జగన్ పార్టీ వీడటంతో జిల్లాలో దాదాపు అందరూ జగన్ వైపు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో అక్కడ పార్టీని రక్షించుకోవాలంటే వైయస్ వివేకాకు అధిష్టానం పదవి ఇచ్చి ప్రోత్సహిస్తుందని అందరూ భావించారు. వివేకా కూడా రాజ్యసభ కోసం కాళ్లకు బలపం కట్టుకొని మరి ఢిల్లీలో తిరిగారు. కానీ పార్టీ తుది జాబితాలో మాత్రం ఆయన పేరు లేదు.

వైయస్ వివేకానంద రెడ్డిని రాజ్యసభకు పంపే విషయంలో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదని తెలుస్తోంది. ఈ కారణంగానే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆయన పేరును పక్కన పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆయనను సంజీవ రెడ్డి స్థానంలో తీసుకుంటారని భావించారు. అయితే ఏకాభిప్రాయం వ్యక్తం కాకపోవడంతో సోనియా అదే సమాజిక వర్గానికి చెందిన మరో నేత కోసం రాష్ట్ర నేతలను అడిగారట. దీంతో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పేరు తెర పైకి వచ్చింది. అధిష్టానానికి విశ్వసనీయంగా ఉండటం, తెలంగాణకు చెందిన వ్యక్తి కావడం, సీనియారిటీ ఉండటం ఇలా పలు అశాలను పరిగణలోకి తీసుకొని సోనియా గాంధీ పాల్వాయిని ఎంపిక చేశారు.

English summary
Late YS Rajasekhar Reddy brother YS Vivekananda Reddy did not get Rajya Sabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X