విజయమ్మ ధర్నా: జగన్‌నే అడ్డుకుని ఉంటే...

K Chandrasekhar Rao
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఆత్మశోధనలో పడినట్లు చెబుతున్నారు. వైయస్ విజయమ్మ ధర్నాను అడ్డుకోవడానికి ప్రజలు చేసిన ప్రయత్నాల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే దీని వెనక తమ తప్పిదం ఉందా అనే కోణం నుంచి ఆలోచన చేస్తోంది. విజయమ్మ కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం కనీవినీ ఎరుగని రీతిలో భద్రత కల్పించడం పట్ల తెరాస వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

కాగా, ఆనాడే తాము సరిగా వ్యవహరించి ఉంటే ఈనాడు ఈ పరిస్థితి వచ్చేది కాదని, ఇందులో నాయకత్వ తప్పిదం ఉందనే అభిప్రాయం తెరాస శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పట్ల ఉదారంగా వ్యవహరిస్తూ ఒక్కసారిగా శత్రుపూరిత వైఖరి తీసుకోవడం కొంత నష్టం చేసిందని భావిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ రైతు దీక్షకు వచ్చినప్పుడు వైయస్ జగన్‌ను అడ్డుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని తెరాస వర్గాలు భావిస్తున్నాయి.

అంతేకాకుండా హైదరాబాదులో ఫీజు దీక్ష చేసినప్పుడు కూడా తెరాస నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. పైగా, దీక్షకు తెరాస తన కార్యకర్తలను పంపించిందనే విమర్శలను కూడా ఎదుర్కుంది. వైయస్ జగన్‌తో తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుమ్మక్కయ్యారనే విమర్శలను నిజం చేసేలా తెరాస వ్యవహారం నడిచిందని అంటున్నారు. దీంతో వైయస్ విజయమ్మ సిరిసిల్ల ధర్నాను అడ్డుకోవడంలో కాస్తా ఇబ్బంది ఎదురైందనే భావన కూడా ఉంది.

మొత్తం మీద, తెలంగాణలో సీమాంధ్ర నాయకులు పర్యటించాలంటే అంత సులభం కాదనే సంకేతాలు మాత్రం వైయస్ విజయమ్మను అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాల వల్ల పంపించగలిగామని తెరాస వర్గాలు భావిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+