నా నోరు, నా ఇష్టం: జర్నలిస్టులపై బొత్స వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పాత్రికేయులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అదేమిటని అడిగితే నా నోరు, నా ఇష్టమని సమాధానమిచ్చారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఆయన జర్నలిస్టులపై వ్యాఖ్యలు చేశారు.
తన నోరు తన ఇష్టమని, తమ ముఖ్యమంత్రికి తాము ఏదైనా చెప్పుకుంటామని బొత్స సత్యనారాయణ అన్నారు. తన గురించి ఏమైనా మాట్లాడుకోవచ్చునని ఆయన జర్నలిస్టులతో చెప్పారు. బొత్స అనుచిత వ్యాఖ్యలపై ఢిల్లీ తెలుగు జర్నలిస్టుల సంఘం మండిపడింది. బొత్స వ్యాఖ్యలను ఖండించింది.

ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్తో భేటీ తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో బొత్స సత్యనారాయణ కూడా పాల్గొన్నారు. కిరణ్ కుమార్ రెడ్డితో పాటు సీమాంధ్రకు చెందిన చిరంజీవి, పళ్లం రాజు తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అధిష్టానం, కేంద్ర ప్రభుత్వం సరైన విధానాన్ని అనుసరించడం లేదని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పళ్లం రాజు అన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ వేగవంతమైందని, తెలుగు ప్రజల మనోభావాలను పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications