బంగారు తల్లీ నాదేనంటున్న చంద్రబాబు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదల కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే ఈ పథకం ద్వారా సహాయం అందజేస్తారు. దీనికి ఆయన చట్టబద్దత కూడా కల్పిస్తున్నారు. ఈ స్థితిలో ఆ పథకం కూడా తన ఆలోచనలోంచి పుట్టిందేనని చంద్రబాబు చెబుకుంటున్నారు. దీనిపై కాంగ్రెసు నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆ పథకం తనదేనని చెప్పడాన్ని శుక్రవారం విజయవాడ కాంగ్రెసు నాయకులు తప్పు పట్టారు.
కాంగ్రెసు శాసనసభ్యుడు ఎం. విష్ణు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రకటనలకు, చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న ప్రకటనలకు ఏ మాత్రం పొంతన లేదని ఆయన అన్నారు. మచిలీపట్నం ఓడరేవు అవసరం లేదని చంద్రబాబు గతంలో చెప్పారని, తాను అధికారంలోకి వస్తే దాన్ని పూర్తి చేస్తానని ఇప్పుడు అంటున్నారని ఆయన అన్నారు.
తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల వైపు కూడా చూడలేదని, పులిచింతల, పోలవరం ప్రాజెక్టులవంటి వాటిని నిర్మించడానికి ముందుకు రాలేదని, ప్రతిపక్షంలోకి రాగానే మాటలు మార్చారని ఆయన అన్నారు. చంద్రబాబు ద్వంద్వవైఖరికి ఇది అద్దం పడుతుందని విష్ణు అన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications