వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బంగారు తల్లీ నాదేనంటున్న చంద్రబాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

 Chandrababu
హైదరాబాద్: ప్రతి మంచి పథకాన్నీ తనదేనని ప్రకటించుకునే అలవాటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో పెరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నగదు బదిలీ పథకం తనదేనని గతంలో చంద్రబాబు చెప్పుకున్నారు. నిజానికి, గత ఎన్నికల్లో ప్రజలకు నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెడతామని హామీ ఇచ్చారు. ఈ మధ్య దాన్ని కేంద్రం ప్రభుత్వం అమలులోకి తీసుకురావడానికి నడుం బిగించింది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల బంగారుతల్లి పథకాన్ని ప్రవేశపెట్టారు. పేదల కుటుంబాల్లో ఆడపిల్ల పుడితే ఈ పథకం ద్వారా సహాయం అందజేస్తారు. దీనికి ఆయన చట్టబద్దత కూడా కల్పిస్తున్నారు. ఈ స్థితిలో ఆ పథకం కూడా తన ఆలోచనలోంచి పుట్టిందేనని చంద్రబాబు చెబుకుంటున్నారు. దీనిపై కాంగ్రెసు నాయకులు తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆ పథకం తనదేనని చెప్పడాన్ని శుక్రవారం విజయవాడ కాంగ్రెసు నాయకులు తప్పు పట్టారు.

కాంగ్రెసు శాసనసభ్యుడు ఎం. విష్ణు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. అసత్యాలతో ప్రజలను మభ్య పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ప్రకటనలకు, చంద్రబాబు ఇప్పుడు చేస్తున్న ప్రకటనలకు ఏ మాత్రం పొంతన లేదని ఆయన అన్నారు. మచిలీపట్నం ఓడరేవు అవసరం లేదని చంద్రబాబు గతంలో చెప్పారని, తాను అధికారంలోకి వస్తే దాన్ని పూర్తి చేస్తానని ఇప్పుడు అంటున్నారని ఆయన అన్నారు.

తన తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల వైపు కూడా చూడలేదని, పులిచింతల, పోలవరం ప్రాజెక్టులవంటి వాటిని నిర్మించడానికి ముందుకు రాలేదని, ప్రతిపక్షంలోకి రాగానే మాటలు మార్చారని ఆయన అన్నారు. చంద్రబాబు ద్వంద్వవైఖరికి ఇది అద్దం పడుతుందని విష్ణు అన్నారు.

English summary
Telugu Desam president N. Chandrababu Naidu’s claim that the “Bangaru Talli” scheme was the brainchild of his party invited severe criticism by Congress leaders in the city on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X