అరెస్ట్తో లింక్: జగన్ బెయిల్ విజయసాయి చేతిలో!
ఇప్పటికే నాలుగు ఛార్జీషీట్లు దాఖలు చేసిన సిబిఐ నెలాఖరులో ఐదో ఛార్జీషీట్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ఐదో ఛార్జీషీట్ దాఖలు తర్వాత జగన్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయితే, అంతకుముందు ఛార్జీషీటుకు ముందే సిబిఐ జగన్ బెయిల్కు విజయ సాయి రెడ్డి అరెస్టుతో కొలికి పెట్టనుందట. కీలకమైన ఐదో ఛార్జీషీటు దాఖలు చేయాలంటే ఈ కేసులో కీలక పాత్రదారి విజయ సాయి బయట ఉండవద్దని, ఆయన అరెస్టుకు అవకాశమిస్తేనే ఛార్జీషీట్ దాఖలు చేసేందుకు వీలవుతుందని చెప్పనుందట.
విజయ సాయి బయట ఉండగా ఛార్జీషీటు దాఖలు చేస్తే అతను సాక్ష్యులను బెదిరించడమో, ప్రభావితం చేయడమో జరిగే అవకాశాలు ఉన్నాయని, తద్వారా కేసు తారుమారవుతుందని, అందుకే ఆయనను అరెస్టు చేస్తే ఛార్జీషీటు దాఖలు చేసేందుకు వీలుగా ఉంటుందని సిబిఐ చెప్పే అవకాశముంటుందని అంటున్నారు. అయితే మరికొన్ని రోజుల్లో విజయ సాయి కూతురు పెళ్లి ఉంది. ఈ సమయంలో విజయ సాయి రెడ్డి ఏం చేస్తారనే అంశం ఆసక్తి రేపుతోంది. విజయసాయి చేతిలోనే జగన్ బెయిల్ దరఖాస్తు ఆధారపడి ఉందంటున్నారు.