కల్వకుంట్ల కవిత పోటీ: కెసిఆర్పై యాష్కీ ఫైర్?
కెసిఆర్పై యాష్కీ ఫైర్ కావడానికి తగిన నేపథ్యమే ఉందని అంటున్నారు. కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. నిజామాబాద్ శానససభా స్థానానికి బిజెపి శానససభ్యుడు లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి కెసిఆర్ నిరాకరించినా నిజామాబాద్ నుంచి బిజెపి అండదండలతో పోటీకి దిగాలని కల్వకుంట్ల కవిత మహా కసితో ఉన్నారని అంటున్నారు.
నిజామాబాద్ సీటు నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని అనుకోవడమే కెసిఆర్పై యాష్కీ మండిపోవడానికి కారణమని అంటున్నారు. తెరాస కాంగ్రెసులో విలీనమైతే కెసిఆర్ మాటను కాదనలేక కాంగ్రెసు అధిష్టానం కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ సీటు కేటాయించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒకవేళ, తెరాస విడిగా పోటీ చేసినా కల్వకుంట్ల కవిత పోటీ చేస్తే తట్టుకోవడం కష్టమని యాష్కీ భావిస్తున్నారట.
కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే యాష్కీ నల్లగొండ జిల్లాలోని భువనగిరి సీటుకు మారాల్సి రావచ్చునని అంటున్నారు. అయితే, భువనగిరి నుంచి కాంగ్రెసు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసులోకి దూకే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అటువంటి స్థితిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తట్టుకోవడం కూడా యాష్కీకి అంత సులభం కాదు. నిజామాబాద్ను వదులుకుని కష్టాల్లో పడడం ఎందుకనే అభిప్రాయంతో ఉన్న యాష్కీ తనకు కష్టాలు తెచ్చిపెడుతున్న కెసిఆర్పై భగ్గుమంటున్నారట.