నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కల్వకుంట్ల కవిత పోటీ: కెసిఆర్‌పై యాష్కీ ఫైర్?

By Pratap
|
Google Oneindia TeluguNews

Madhu Yashki - Kalwakuntla
హైదరాబాద్: ఇటీవలి కాలంలో కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ చీమ చిటుక్కుమంటే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై కస్సుమంటున్నారు. ఇతర పార్టీల నుంచి తాము నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఆయన కెసిఆర్‌పై గుర్రుమంటున్నారు. షరతులు లేకుండా తెరాసను కాంగ్రెసులో విలీనం చేస్తారా అని అడిగారు. మొదట్లో కెసిఆర్‌తో స్నేహసంబంధాలను నెరిపిన యాష్కీ ఒక్కసారిగా ఇలా మాట్లాడుతున్నారేమిటని చాలా మంది ముక్కున వేలేసుకుంటున్నారు.

కెసిఆర్‌పై యాష్కీ ఫైర్ కావడానికి తగిన నేపథ్యమే ఉందని అంటున్నారు. కెసిఆర్ కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంటు సీటు నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారట. నిజామాబాద్ శానససభా స్థానానికి బిజెపి శానససభ్యుడు లక్ష్మీనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. తన తండ్రి కెసిఆర్ నిరాకరించినా నిజామాబాద్ నుంచి బిజెపి అండదండలతో పోటీకి దిగాలని కల్వకుంట్ల కవిత మహా కసితో ఉన్నారని అంటున్నారు.

నిజామాబాద్ సీటు నుంచి కల్వకుంట్ల కవిత పోటీ చేయాలని అనుకోవడమే కెసిఆర్‌పై యాష్కీ మండిపోవడానికి కారణమని అంటున్నారు. తెరాస కాంగ్రెసులో విలీనమైతే కెసిఆర్ మాటను కాదనలేక కాంగ్రెసు అధిష్టానం కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ సీటు కేటాయించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. ఒకవేళ, తెరాస విడిగా పోటీ చేసినా కల్వకుంట్ల కవిత పోటీ చేస్తే తట్టుకోవడం కష్టమని యాష్కీ భావిస్తున్నారట.

కల్వకుంట్ల కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేస్తే యాష్కీ నల్లగొండ జిల్లాలోని భువనగిరి సీటుకు మారాల్సి రావచ్చునని అంటున్నారు. అయితే, భువనగిరి నుంచి కాంగ్రెసు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన వైయస్సార్ కాంగ్రెసులోకి దూకే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అటువంటి స్థితిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తట్టుకోవడం కూడా యాష్కీకి అంత సులభం కాదు. నిజామాబాద్‌ను వదులుకుని కష్టాల్లో పడడం ఎందుకనే అభిప్రాయంతో ఉన్న యాష్కీ తనకు కష్టాలు తెచ్చిపెడుతున్న కెసిఆర్‌పై భగ్గుమంటున్నారట.

English summary

 It is said that Congress MP Madhu Yashki is talking against Telangana Rastra Samithi (TRS) president K Chandrasekhar Rao, as Telangana Jagruthi president Kalwakuntla Kavitha is trying to contest from Nizamabad Loksabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X