విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విచిత్రం: పార్టీ కష్టాలు కలెక్టర్‌కి చెప్పుకున్నటిడిపి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswar Rao
కృష్ణా జిల్లా తెలుగు తమ్ముళ్లు తికమక పడ్డారు. పార్టీని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఓ వినతి పత్రం ఇచ్చారు. బుధవారం తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో తెలుగు తమ్ముళ్లు జిల్లా కలెక్టర్‌ను కలుసుకున్నారు. జిల్లా సమస్యలను పరిష్కరించాలని వారు అందులో విజ్ఞప్తి చేశారు.

రైతుల సమస్యలు మొదలు బందరు పోర్టు వరకు పలు సమస్యలను వారు అందులో ఏకరువు పెట్టారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని కోరారు. జిల్లా సమస్యలతో పాటు వారు పార్టీ సమస్యను కూడా అందులో ప్రస్తావించడటం విశేషం. ఇది చూసిన మీడియా ప్రతినిధులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.

దీనిని తెలుగుదేశం పార్టీ నేతల దృష్టికి తీసుకు వెళ్లారు. దానిని చూసిన తెలుగు తమ్ముళ్లు ఇదెలా జరిగిందంటూ.. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. జిల్లా సమస్యలతో పాటు గ్రామస్థాయిలో పార్టీని పటిష్ట పరిచి స్థానిక సంస్థ ఎన్నికలలో గెలుపుకు కృషి చేయాలని అందులో కోరారు.

అంతేకాదు ఆవనిగడ్డ, పెనుమలూరు తదితర నియోజకవర్గాలకు ఇంఛార్జులను నియమించాలని విజ్ఢప్తి చేశారు. వినతిపత్రంలోని విచిత్రాలను మీడియా ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చాక, వాటిని గుర్తించిన తెలుగు తమ్ముళ్లు ఆ తర్వాత వాటిని తొలగించి కలెక్టర్‌కు మరో వినతి పత్రం ఇచ్చారు.

English summary
Krishna District Telugudesam Party leaders included party issues in Collector's request letter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X