'బలవంతపు సంసారంపై మీ భార్యల్ని అడగండి'

విభజనకు అనుకూలంగా కాంగ్రెసు వర్కింగ్ కమిటీ నిర్ణయం చేశాక దానిని అడ్డుకుంటామని, విభజన జరగదని సీమాంధ్ర ఎంపీలు లగడపాటి రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్లు వ్యాఖ్యానించడం సిగ్గుచేటు అన్నారు. పార్టీ నిర్ణయంపై గౌరవం లేకుండా ధిక్కార ధోరణితో వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
గురువారం లోకసభలో తాము ఉండవల్లి ప్రసంగాన్ని అడ్డుకోలేదని చెప్పారు. వాస్తవాలు చెప్పాలని మాత్రమే అడిగామన్నారు. ఇందిరా గాంధీ వ్యాఖ్యలను చెబుతున్న ఉండవల్లిని జవహర్ లాల్ నెహ్రూ, సోనియా గాంధీల వ్యాఖ్యలను కూడా చెప్పాలని తాము సభలో అడిగామన్నారు.
దేశాన్ని ఉద్దరించడానికే పుట్టినట్లుగా సీమాంధ్ర ఎంపీలు వ్యవహరిస్తున్నారని, వారి దొంగ నాటకాలను కట్టిపెట్టాలన్నారు. ఎపిఎన్జీవోల సభకు అనుమతివ్వడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విద్వేషాలను మరింత పెంచుతున్నారని ఆరోపించారు. హైదరాబాదులో శాంతిభద్రతలకు విఘాతం కలిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. హైదరాబాదులో ఉన్న సీమాంధ్రులు విభజనను సమర్థించాలన్నారు.












Click it and Unblock the Notifications