జగన్ పార్టీలో రోజా గెస్ట్ రోల్, టీవీ షోల్లో...?
వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తొలుత చురుగ్గా కనిపించిన రోజా రాను రాను తన కార్యకలాపాలను తగ్గించుకున్నట్లు చెబుతున్నారు. అప్పుడప్పుడు పార్టీ కార్యకలాపాల్లో కనిపిస్తూ లేదా ఇతర పార్టీలను దుమ్మెత్తిపోస్తూ కనిపిస్తున్నారని అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో తెలుగు మహిళ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు మందీమార్బలంతో ఆమె అప్పటి వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై మాటల ఈటెలు రువ్వుతూ వచ్చారు. సినీ గ్లామర్కు మాటకారితనం తోడై తెలుగుదేశం పార్టీలో ఆమె రాజకీయాలతో ఓ ఆట ఆడుకున్నారు. శాసనసభకు పోటీ చేసి ఓడిపోయిన ప్రత్యర్థులకు చెమటలు పట్టించారు.
రెండో సారి గెలిచి వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆమె కాంగ్రెసు పార్టీలో చేరాలని అనుకున్నారు. అందుకు వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోత్సాహం అందించారు. అయితే, ఆయన హఠాన్మణంతో సంభవించిన పరిణామాల నేపథ్యంలో ఆమె జగన్ వైపు వచ్చారు. జగన్ పార్టీలో చేరిన తర్వాత మొదట్లో కాస్తా యాక్టివ్గానే కనిపించారు. ఏమైనా, వచ్చే ఎన్నికల నాటికి రోజా యాక్టివ్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.