పార్టీల్లో సాక్షితో ఎంజాయ్: శ్రీ ఫోన్ ఎందుకిచ్చాడు?

ఈ సందర్భంగా శ్రీశాంత్ తన ఖరీదైన్ ఫోన్ను సాక్షి జాలాకు ఇచ్చాడట. తన ఇంటికి విందుకు వచ్చిన శ్రీశాంత్ ఆ ఫోన్ను తన కూతురుకు బహుమతిగా ఇచ్చాడని సాక్షి జాలా తండ్రి అతుల్ చెబుతున్నాడు. అతడు రైల్వే పర్యాటక శాఖలో అసిస్టెంట్ మేనేజర్గా పని చేస్తున్నారు. శ్రీశాంత్ ఫోన్ ఇచ్చినందుకు బదులుగా తాము పులి పోస్టర్ను శ్రీశాంత్కు బహుమతిగా ఇచ్చామని అతడు పోలీసులకు తెలిపాడు. జైపూర్లో ఐపిఎల్ మ్యాచ్ల తర్వాత సాక్షి జాలాతో కలిసి శ్రీశాంత్ పార్టీలకు హాజరయ్యేవాడట.
ఒక్క మ్యాచ్ పైన రూ.500 కోట్ల బెట్టింగ్
ఐపిఎల్ 6 స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో మరో కొత్త కోణం బయటపడింది. చెన్నైలో అరెస్టైన బుకీ ప్రశాంత్కు పలువురు పారిశ్రామికవేత్తలు, సినీ ప్రముఖులతో సంబంధం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. ప్రశాంత్ను ప్రశ్నించారు. విచారణలో ఆయన కళ్లు చెదిరే వాస్తవం చెప్పాడట. బెట్టింగులో ఉత్తరాది వారితో కలిసి 150 మంది పాల్గొన్నట్లు చెప్పాడట.
కాగా మే 6న చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో రూ.360 కోట్ల నుంచి రూ.500 కోట్ల సొమ్ము బెట్టింగ్ చేతులు మారిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టైన అజిత్ చండిలకు బుకీల నుంచి వేర్వేరు దఫాలుగా రూ.49 లక్షలు ముట్టినట్లుగా పోలీసులు తెలిపిన విషయం తెలిసిందే.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications