ధోనీ గ్రేట్, చూసి బుద్ది తెచ్చుకోవాలి: కపిల్ సంచలనం
కోల్కతా: భారత క్రికెట్ మాజీ సారథి కపిల్ దేవ్ మంగళవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీర్ఘకాలం తమ కుర్చీలను అట్టిపెట్టుకుని ఉండే క్రీడా పాలకులు మహేంద్ర సింగ్ ధోనీని చూసి బుద్ధి తెచ్చుకోవాలన్నారు. టెస్టుల నుండి సరైన సమయంలో ధోనీ తప్పుకొని, అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.
ఎవరైనా ఆడాలనుకుంటే రెండువందల టెస్టులు కూడా ఆడవచ్చునని చెప్పారు. కానీ ధోనీ మాత్రం అలా చేయలేదన్నారు. తాను చేయగలిగింది చేశా, ఇక తర్వాత తరం ఆడుకోనివ్వండి అంటూ సంకేతాలిస్తూ టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పాడన్నారు. అందుకు తాను ధోనీని అభినందిస్తున్నానని చెప్పారు.

అతనో గొప్ప వ్యక్తి అన్నారు. క్రికెట్కు ఎంతో చేశాడన్నారు. ధోనీ కనీసం వందో టేస్టు దాకా ఆడాలని మనమందరం అనుకున్నామని, కాని అతను నూతనంగా ఆలోచించాడన్నారు. జీవితమంతా ఆడుతూనే ఉండాలని ఎవరు అనుకోకూడదన్నారు.
తర్వాత తరం వస్తుందని తెలిశాక రిటైరవ్వాలని సూచించారు. ఈ సందర్భంగా కపిల్.. గ్రెగ్ చాపెల్ చేసిన ఓ మాట చెప్పారు. 'ఓ ఆటగాడు తన సమయం దాటిపోయాక కూడా కొనసాగితే.. తర్వాత మూడు తరాలకు నష్టం చేకూర్చినట్లే' అని చాపెల్ అన్నాడన్నారు. ఈ మాటను తాను గౌరవిస్తానని చెప్పారు. క్రికెట్ పాలకులు కూడా 30 ఏళ్లు లేదా జీవితాంతం కుర్చీలకు అతుక్కోవద్దని, ధోనీని చూసి బుద్ది తెచ్చుకోవాలన్నారు.
-
రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. విశ్వవిజేతగా భారత్ -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ఫైనల్లో హై-వోల్టేజ్ డ్రామా: అర్ష్దీప్, మిచెల్ మధ్య గొడవ! వీడియో -
ఐపీఎల్ 2026 సీజన్ షెడ్యూల్ వచ్చేసింది! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications