మందలింపు సరిపోదు, ఉరితీయండి: జస్టిస్ కట్జూ
న్యూఢిల్లీ: తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను రాజ్యసభలో ఖండించడంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ ఛైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ తీవ్రంగా స్పందించారు. విదేశాల్లో ఉన్న ఆయన దీనిపై మాట్లాడుతూ.. తాను చేసిన వ్యాఖ్యలపై ఖండిస్తూ తీర్మానం చేయడం ఏమాత్రం సరిపోదని, చేతనైతే తాను దేశానికి వచ్చిన వెంటనే ఉరితీయాలని అన్నారు.
తనకు వస్తున్న ఆర్థిక, ఇతరత్రా ప్రయోజనాలను కూడా నిలిపివేయాలని సూచించారు. అలా నిలిపేయాలంటూ నిబంధనలు సవరించాలని, తాను సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తినన్న విషయం మరువొద్దని కట్జూ తెలిపారు.

తాను విదేశాల నుంచి తిరిగి రాగానే అరెస్ట్ చేసి, ఆ తర్వాత వెంటనే ఉరితీయాలంటూ ఎంపీలు ఓ తీర్మానం ఆమోదించాలని అన్నారు.
ఇటీవల ఆయన మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన జాతిపిత గాంధీజీ బ్రిటీష్ ఎజెంట్ అని, నేతాజీ సుభాష్ చంద్రబోస్ను జపనీయుడిగా వ్యవహరించారని పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రాజ్యసభ తీర్మానం కూడా చేసింది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications