సమోసాలు తినండి, ఏంకాదు: కేజ్రీతో ప్రణబ్(ఫోటోలు)
న్యూఢిల్లీ: బుధవారం రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన టీ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ, అరవింద్ కేజ్రీవాల్ మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ పేస్ట్రీని తింటుండగా అది చూసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తక్కువగా తింటున్నారేంటీ.... కాస్త గట్టిగానే తినండి, మీ ఆరోగ్యానికి ఏమీ కాదంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
దీంతో అక్కడ నవ్వులు పూశాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డుల ఫంక్షన్కు వచ్చిన అతిథుల కోసం ఇచ్చిన టీ పార్టీలో సమోసాలు, జాము కలాన్, పేస్ట్రీ, పకోరాస్, శాండ్ విచ్లు టేబుల్పై ఉంచారు. 46 ఏళ్ల అరవింద్ కేజ్రీవాల్కు షుగర్ సమస్య ఉంది. ఇటీవల అనారోగ్యం కారణంగా అరవింద్ కేజ్రీవాల్ బెంగుళూరులో పది రోజుల పాటు ప్రకృతి చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.
సమోసాలు తినండి, ఏమీ కాదు: కేజ్రీతో ప్రణబ్
బుధవారం రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన టీ పార్టీలో ప్రణబ్ ముఖర్జీ, అరవింద్ కేజ్రీవాల్ మధ్య సరదా సంభాషణ చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ పేస్ట్రీని తింటుండగా అది చూసిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తక్కువగా తింటున్నారేంటీ.... కాస్త గట్టిగానే తినండి, మీ ఆరోగ్యానికి ఏమీ కాదంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
సమోసాలు తినండి, ఏమీ కాదు: కేజ్రీతో ప్రణబ్
దీంతో అక్కడ నవ్వులు పూశాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పద్మ అవార్డుల ఫంక్షన్కు వచ్చిన అతిథుల కోసం ఇచ్చిన టీ పార్టీలో సమోసాలు, జాము కలాన్, పేస్ట్రీ, పకోరాస్, శాండ్ విచ్లు టేబుల్పై ఉంచారు. 46 ఏళ్ల అరవింద్ కేజ్రీవాల్కు షుగర్ సమస్య ఉంది. ఇటీవల అనారోగ్యం కారణంగా అరవింద్ కేజ్రీవాల్ బెంగుళూరులో పది రోజుల పాటు ప్రకృతి చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.
సమోసాలు తినండి, ఏమీ కాదు: కేజ్రీతో ప్రణబ్
ఇటీవలే బెంగళూరులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నేచురోపతిలో వివిధరకాలైన చికిత్సలు అందించారు. యోగ క్రియ ద్వారా శరీరంలో అవయవాలను ప్యురిఫికేషన్ చేసే ప్రక్రియను చేపట్టారు. ఆ తర్వాత మట్టితో కూడిన మడ్ థెరిపీని అందించారు. శరీరానికి మట్టిని పోతలా పూశారు.
సమోసాలు తినండి, ఏమీ కాదు: కేజ్రీతో ప్రణబ్
అనంతరం వేడి నీటితో శరీరాన్ని శుభ్రం చేయడంతో శరీరంలో ఉన్న మృతకణాలు తొలగి పోయి శరీరం కాంతి వంతంగా, ఆరోగ్యవంతంగా తయారైంది. ఇవే కాకుండా కేజ్రీవాల్ కు అక్వాటిక్ థెరిపీ, హైడ్రో థెరిపీ లను కూడా అందించారు. ఈ రకమైన చికిత్సకోసం అరవింద్ కేజ్రీవాల్ రోజుకు 17వేల రూపాయలను ఫీజు రూపంలో చెల్లించారు.