అమర్ హెచ్చరిక, జయప్రదకు కేబినెట్ హోదా పదవి
లక్నో: ములాయం సింగ్ యాదవ్తో అమర్ సింగ్ మళ్లీ జత కలిసిన నేపథ్యంలో ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ హోదా పదవిని ఇచ్చింది. చాలా ఏళ్ల పాటు అమర్ సింగ్ సమాజ్ వాది పార్టీకి దూరంగా ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం ఆయన తిరిగి సమాజ్ వాది పార్టీలో చేరారు. ములాయం సింగ్ మళ్లీ ఆయనను దరి చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో అమర్ సింగ్కు రాజకీయంగా బాగా స్నేహితురాలైన జయప్రదకు కేబినెట్ ర్యాంకు పదవి లభించింది.

అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం.. యూపీ ఫిలిం డెవలప్మెంట్ కౌన్సెల్ సీనియర్ డిప్యూటీ చైర్ పర్సన్గా జయప్రదను నియమించారు.
పార్టీలో తనకు, తన సన్నిహితురాలు జయప్రదకు అవమానం జరుగుతోందని, పార్టీ నుంచి వైదొలుగుతామని ఇటీవల అమర్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెకు పదవి రావడం గమనార్హం.
యూపీ ఫిలిం డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్గా ఇటీవల కవి గోపాల్ దాస్ నీరజ్ను నియమించారు. ఇప్పుడు జయప్రదకు డిప్యూటీ చైర్ పర్సన్ పదవి ఇచ్చారు. జయప్రద గతంలో యూపీలోని రాంపూర్ నుంచి ఎస్పీ తరఫున ఎంపీగా ఉన్నారు. 2010లో అమర్ సింగ్తో పాటు పార్టీ నుంచి ఉద్వాసనకు గురయ్యారు.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications