ముద్రగడ కొత్త పాయింట్, 'రూ.లక్ష కోట్ల' జగన్కి అస్త్రం
విజయవాడ: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ధీటుగా స్పందించారు. చంద్రబాబు రెండెకరాల పొలం నుంచి రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారని ముద్రగడ ప్రశ్నించారు.
ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 'నీకిది - నాకది' పద్ధతిలో అతను పెద్ద మొత్తంలో దోపిడీ చేశారని ఆరోపిస్తున్నారు.
ఇందుకు వారు ఆయన పైన వేసిన ఛార్జీషీట్లు, సిబిఐ, ఈడీ దర్యాఫ్తులను ఆధారంగా చూపిస్తున్నారు. అయితే, కేసు విచారణలో ఉందని, ప్రస్తుతం జగన్ నిందుతుడు మాత్రమేనని, నేరస్తుడు కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

అయితే, జగన్ రూ.లక్ష కోట్లకు ఇప్పుడు ముద్రగడ వైసిపికి చంద్రబాబుపై రూ.2 లక్షల కోట్ల ఆయుధాన్ని ఇచ్చారు. చంద్రబాబు రెండు ఎకరాల పొలం నుంచి రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ముద్రగడ ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక వైయస్ జగన్ కూడా ఉన్నారా అనే చర్చ సాగుతోంది.
జగన్ పైన రూ.లక్ష కోట్ల ఆరోపణలు చేస్తున్నందున రూ.2 లక్షల కోట్లతో చంద్రబాబుపై కౌంటర్గా ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారా అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు తన ఆస్తుల విషయంలో పారదర్శకత పాటిస్తున్నారని చినరాజప్ప చెబుతున్నారు.
-
చరిత్ర సృష్టించిన ఏపీ జెన్ కో.. 6160 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితో.. -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!!












Click it and Unblock the Notifications