ముద్రగడ కొత్త పాయింట్, 'రూ.లక్ష కోట్ల' జగన్కి అస్త్రం
విజయవాడ: మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం ఆదివారం నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ధీటుగా స్పందించారు. చంద్రబాబు రెండెకరాల పొలం నుంచి రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారని ముద్రగడ ప్రశ్నించారు.
ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని రూ.లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపిస్తూ వస్తున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో 'నీకిది - నాకది' పద్ధతిలో అతను పెద్ద మొత్తంలో దోపిడీ చేశారని ఆరోపిస్తున్నారు.
ఇందుకు వారు ఆయన పైన వేసిన ఛార్జీషీట్లు, సిబిఐ, ఈడీ దర్యాఫ్తులను ఆధారంగా చూపిస్తున్నారు. అయితే, కేసు విచారణలో ఉందని, ప్రస్తుతం జగన్ నిందుతుడు మాత్రమేనని, నేరస్తుడు కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.

అయితే, జగన్ రూ.లక్ష కోట్లకు ఇప్పుడు ముద్రగడ వైసిపికి చంద్రబాబుపై రూ.2 లక్షల కోట్ల ఆయుధాన్ని ఇచ్చారు. చంద్రబాబు రెండు ఎకరాల పొలం నుంచి రూ.2 లక్షల కోట్లు ఎలా సంపాదించారో చెప్పాలని ముద్రగడ ప్రశ్నించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యల వెనుక వైయస్ జగన్ కూడా ఉన్నారా అనే చర్చ సాగుతోంది.
జగన్ పైన రూ.లక్ష కోట్ల ఆరోపణలు చేస్తున్నందున రూ.2 లక్షల కోట్లతో చంద్రబాబుపై కౌంటర్గా ఈ అంశాన్ని తెరపైకి తీసుకు వచ్చారా అనే చర్చ సాగుతోంది. చంద్రబాబు తన ఆస్తుల విషయంలో పారదర్శకత పాటిస్తున్నారని చినరాజప్ప చెబుతున్నారు.
-
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications