చంద్రబాబు కాన్వాయ్కు డాక్టర్లు: ఎవరూ ముందుకు రావడం లేదా?
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్కు కేటాయించిన అంబులెన్స్లో పని చేసేందుకు డాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. ఈ మేరకు మీడియాలో ప్రచారం సాగుతోంది.
అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్కు కేటాయించిన అంబులెన్స్లో పని చేసేందుకు డాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదని అంటున్నారు. ఈ మేరకు మీడియాలో ప్రచారం సాగుతోంది.
విజయవాడ, గుంటూరు, విశాఖ, తిరుపతిలలో నాలుగు అత్యాదునిక అంబులెన్సులు కేటాయించారు. ముఖ్యమంత్రి ఏ జిల్లాలో పర్యటించినా సమీపంలోని అంబులెన్స్ కాన్వాయ్లో ఉంటుంది.
భారీ షాక్: టిడిపిలోకి ఐదుగురు కీలక నేతలు జంప్? ఏం చేద్దామని జగన్ ఆరా
వీటిల్లో జనరల్ మెడిసిన్స్, అనస్తీషియా, ఆర్థోపెడిక్ డాక్టర్లతో పాటు ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు ఉంటారు. నెలకు వీరికి రూ.60 వేల వేతనం ఉంటుంది. ఇందుకోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ దరఖాస్తులేమీ రాలేదట.
ఆ తర్వాత రూ.75 వేలకు పెంచి మళ్లీ నోటిఫికేషన్ ఇచ్చారని, అప్పుడు ఇద్దరు మాత్రమే ముందుకు వచ్చారని అంటున్నారు. సీఎం కాన్వాయ్ అంబులెన్స్లో పని చేసేందుకు ఎందుకు రావడం లేదనే చర్చ సాగుతోందని అంటున్నారు.