నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా? అయితే వెంటనే వీటిని తినండి!
ప్రస్తుత సమాజంలో నిద్రలేమి సమస్య అతి పెద్ద సమస్యగా మారింది. అనేక సమస్యలతో సతమతమవుతూ సరిగ్గా నిద్రపోలేక, పడుకుంటే నిద్రరాక అనారోగ్యానికి గురవుతున్నారు. అలా నిద్రలేమి సమస్యతో బాద పడుతున్న వారు రోజువారీ ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు అని చెప్తున్నారు డైటీషియన్లు.కొన్ని రకాల పండ్లతో పాటు, కొన్ని రకాల ఆకు కూరలు తీసుకోవడం వలన కొంత మేరకు నిద్రలేమి సమస్యను అరికట్టవచ్చునని చెప్తున్నారు.
నిద్రలేమికి ఎన్నో కారణాలు
ఎక్కువగా నాన్ వెజ్ తినే వారికి తొందరగా డైజెషన్ కాకపోవడం వలన నిద్రకు భంగం కలుగుతుంది. నిద్రలేమి సమస్యతో గుండె సంబంధిత వ్యాధుల వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మానసిక ఒత్తిడికి గురవుతున్న వారిలో కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది. నిద్ర వేళకు ఫుల్ గా భోజనం చేయడం జీర్ణక్రియ ఆలస్యంగా జరగడం వలన కడుపులో ఆయాసం ,ఉబ్బరం తో రాత్రంతా నిద్రకు భంగం కలుగుతుంది. ఇలా అనేక కారణాలు నిద్రలేమిని కలిగిస్తాయి.

ఇవి తింటే నిద్రలేమి సమస్యకు చెక్
నిద్రలేమి సమస్యకు ఆకుకూరలతో చెక్ పెట్టొచ్చు. పాలకూర, బచ్చలికూర, తోటకూర వంటి ఆకుకూరల్లో మెగ్నీషియం,కార్బోహైడ్రేట్లు మిటమిన్లు ఏ,విటమిన్ సి, విటమిన్ కె,తోపాటు ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. వీటిని తింటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టొచ్చు. ఆకుకూరలలో తొందరగా అరిగే చాన్స్ ఉండటం వలన నిద్రకు ఎలాంటి సమస్య ఉండదు. పాలకూర తో గుండె సంబంధిత వ్యాధులను కూడా కట్టడి చేసే అవకాశం ఉందని వైద్యనిపుణులు సూచిస్తుంటారు.
పండ్లు, పాలతో పాటు ఇవి తింటే మంచి నిద్ర
అయితే ఆకుకూరలు మాత్రమే కాదు కొన్నిరకాల పండ్లు కూడా మన నిద్రకు ఎంతగానో ఉపయోగపడతాయి. కివీ, చెర్రీస్ వంటి పండ్లు, అరటిపండ్లు మన నిద్రను మేరుగుపరచటం కోసం దోహదం చేస్తాయి. గోరు వెచ్చని పాలలో దాల్చిన చెక్క పొడిని గ్లాసు పాలలో చిటికెడు పొడిని కలుపుకొని తాగితే మంచి నిద్ర పడుతుంది. వాల్ నట్స్, గుమ్మడి గింజలు, చియా సీడ్స్ వంటి వాటిని ఆహారంలో తీసుకోవటం వలన కూడా నిద్ర బాగా పడుతుంది. మంచి పోషకాహారం మన నిద్రను మెరుగుపరుస్తుంది.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications