షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉండాలా? ఈ టిప్స్ పాటిస్తే చాలు..!!
వేగంగా పెరుగుతున్న సమస్య డయాబెటిస్. ఈ డయాబెటిస్ శరీరంలో ఇన్సులిన్ తగినతంగా లేకపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక వ్యాధి. ఇది క్లోమం ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. కానీ, సరైన ఆహారం, వ్యాయామం, మందుల సాయంతో దీన్ని నియంత్రణలో ఉంచవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చిట్కాలతో రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది. షుగరు పూర్తిగా తగ్గే వ్యాధి కాదు. నియంత్రణలో ఉంచుకోవటం చాలా అవసరం. దీని కోసం ఆహారంతో పాటుగా జీవనశైలి మార్పు చేసుకోవాలి.
షుగరు పెరిగితే శరీరంలోని అన్ని అవయవాల పైన ప్రభావం ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోవడం వల్ల గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వైఫల్యం వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఎటువంటి శారీరక శ్రమ చేయకపోవడంతో కండరాలు గ్లూకోజ్ను సరిగ్గా ఉపయోగించుకోలేవని నిపుణులు చెబుతున్నారు. అందుకే శారీరక శ్రమ తప్పనిసరంటున్నారు. ప్రతి 45 నిమిషాలకు కేవలం 10 స్క్వాట్లు చేయాలని సిఫార్సు చేస్తున్నారు. తిన్న తర్వాత రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే, తిన్న తర్వాత కేవలం 10 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర దాదాపు 22 mg/dL తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, మునగ కాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

మునగకాయలు, వాటి ఆకులు ఇన్సులిన్ లాగా పనిచేస్తాయి. వాటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో చక్కెరను శక్తిగా మార్చడంలో సహాయపడతాయి. కాబట్టి, మునగాకును ప్రతిరోజూ రసం లేదా పొడి రూపంలో తీసుకోవడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. డయాబెటిస్ వారికి బార్లీ చాలా మేలు చేస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఉసిరిలో విటమిన్ సి, క్రోమియం ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. ఉసిరి రసం లేదా తాజా ఉసిరిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల క్లోమం పనితీరు మెరుగుపడుతుంది. వేప పుల్లలు లేదా త్రిఫల పొడితో నోటి పరిశుభ్రతను కాపాడుకోవడం, ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటితో మెంతులు లేదా గుర్మార్ పొడిని తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే, కూరగాయలు, తొక్కతీసిన పండ్లు, పప్పు ధాన్యాలు ఎక్కువగా తీసుకోవా లని సూచిస్తున్నారు.
-
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications