కంటి క్షయ గురించి మీకు తెలుసా? నిర్లక్ష్యం చేస్తే చూపు కోల్పోతారు
సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అటువంటి కళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏ పనైనా చేయగలుగుతాం. కళ్ళ ఆరోగ్యం పైన ప్రతి ఒక్కరికి కచ్చితంగా సరైన అవగాహన ఉండాలి. ప్రస్తుతం మనదేశంలో కళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకరమైన కేసులు నమోదవుతున్నాయి. భారతదేశంలో కంటి క్షయ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యగా మారుతోంది.
కంటి క్షయ వ్యాధి అంటే ఏమిటి?
కంటి క్షయ అనేది కంటికి వచ్చే ఒక అంటు వ్యాధి. ఇది సాధారణంగా ఊపిరితిత్తులకు వచ్చే క్షయ వ్యాధి (Tuberculosis) వల్ల వస్తుంది. కంటి క్షయ వ్యాధి ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపించదు. మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బాక్టీరియా కంటికి సోకడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కంటిలోని ఏ భాగానికైనా ఈ వ్యాధి సోకవచ్చు, కానీ ఇది సాధారణంగా కంటి వెనుక భాగాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది.

కంటి క్షయ లక్షణాలు
కంటి క్షయ యొక్క లక్షణాలు వ్యక్తిని బట్టి మారుతూ ఉంటాయి. కంటి క్షయ వ్యాధి యొక్క లక్షణాలు గమనించినట్లయితే కొందరిలో కంటి నొప్పి, కన్ను ఎర్రగా మారడం, చూపు మందగించడం, కాంతిని చూడలేకపోవడం, కళ్ళు నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్షయ వ్యాధి ఉన్న వ్యక్తి నుండి మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ బాక్టీరియా వ్యాప్తి చెందడం వల్ల కంటి క్షయ వస్తుంది.
వీరికి వచ్చే అవకాశం
ఇది నేరుగా కంటికి సోకవచ్చు లేదా రక్తం ద్వారా కూడా వ్యాప్తి చెందవచ్చు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, హెచ్ఐవి/ఎయిడ్స్ ఉన్నవారు, మధుమేహం ఉన్నవారు మరియు స్టెరాయిడ్స్ తీసుకునేవారు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. కంటి క్షయ ఉన్నవారి ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. వీరు బాధితులు మాత్రమే.
కంటి క్షయ వ్యాధి నిర్ధారణ మరియు చికిత్స
కంటిపరీక్షలు, రక్తపరీక్షలు మరియు ఛాతీ ఎక్స్-రే ద్వారా కంటి క్షయవ్యాధిని నిర్ధారించవచ్చు. కంటి వైద్య నిపుణులు కంటి నిర్మాణాన్ని పరిశీలించి, వ్యాధి లక్షణాలను గుర్తించడానికి వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. క్షయవ్యాధి నిర్ధారణ అయిన తర్వాత, వైద్యులు సాధారణంగా యాంటీబయాటిక్స్ సూచిస్తారు. ఈ మందులను ఒక కోర్స్ గా కొన్ని నెలల పాటు క్రమం తప్పకుండా వాడాలి. వ్యాధి తీవ్రతను బట్టి, కొన్నిసార్లు స్టెరాయిడ్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది.
కంటి క్షయ వ్యాధిని నివారించడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు
కంటి క్షయను నివారించడానికి కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వీరు క్షయ వ్యాధి సోకిన వ్యక్తులకు దూరంగా ఉండాలి. రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం, మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం. తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం ద్వారా కూడా ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి జాగ్రత్తలు తీసుకోవాలి.భారతదేశంలో కంటి క్షయ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. లేకపోతే కన్ను కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications