Health tips: బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా? అయితే మీ గుండెకు ముప్పే.. జాగ్రత్త!!
చాలామంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానేస్తుంటారు. ఉదయం అల్పాహారం తీసుకోకపోవడం ఆరోగ్యమని ఫీల్ అవుతూ ఉంటారు. బరువు తగ్గడానికి చేసే డైటింగ్ లో అల్పాహారం తీసుకోకపోవడం ఒక భాగమని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం చాలా డేంజర్ అండ్ హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు.

బ్రేక్ ఫాస్ట్ చెయ్యని వారికి గుండె పోటు ముప్పు
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చెయ్యని వాళ్లలో వ్యాధినిరోధక శక్తి గణనీయంగా తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. వివిధ ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడే శక్తిని కూడా శరీరం పోగొట్టుకుంటుందని సూచిస్తున్నారు. అంతే కాదు మరో ముఖ్యమైన విషయం కూడా వెల్లడించారు వైద్యులు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయని వారిలో గుండెపోటు ముప్పు చాలా ఎక్కువగా ఉందని పేర్కొంటున్నారు. ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనం కూడా ఈ విషయాన్ని వెల్లడించిందని, ఆరోగ్యం కోసం చేసే ఫాస్టింగ్ లలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అవి మన ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇటీవల పెరుగుతున్న గుండె పోటు మరణాలు.. కారణం ఇదే
ఇటీవల కాలంలో మనం తరచూ వయసుతో సంబంధం లేకుండా, చిన్న పెద్ద తేడా లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్న వారిని చూస్తున్నాం. చిన్న చిన్న వయసులలో, ఊబకాయం సమస్య లేకపోయినప్పటికీ, ఇతరత్రా అనారోగ్య సమస్యలు లేకున్నా కూడా ఎంతోమంది చనిపోతున్న పరిస్థితులు ప్రస్తుతం మనల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటన్నిటికీ ముఖ్యమైన కారణం పోషకాహార లోపం, సరైన సమయంలో తినకపోవడం, సమయానికి నిద్రపోకపోవడం, సరైన శారీరక వ్యాయామం లేకపోవడంగా చెప్పవచ్చు.

బ్రేక్ ఫాస్ట్ తో శరీరానికి కావాల్సిన పోషకాలు
కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కచ్చితంగా ప్రతి ఒక్కరు సమయానుకూలంగా పోషకాహారాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, పుష్కలంగా లభిస్తాయని, మన శరీరం శక్తివంతంగానూ, ఆరోగ్యంగానూ ఉండడానికి దోహదం చేస్తుందని చెబుతున్నారు. ఎప్పుడైనా ఎవరైనా ఆహారాన్ని తీసుకోకూడదు అనుకుంటే అది రాత్రి వేళల్లో బాగా ఆలస్యమైతే తీసుకోకుండా ఉంటే మంచిదని చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ కడుపునిండా తినాలని, మధ్యాహ్నం లంచ్ మితంగా తినాలని, రాత్రి డిన్నర్ ఏడు గంటల లోపే పూర్తి చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకుంటే ఈ రోగాలకు ఛాన్స్
ఉదయం బ్రేక్ ఫాస్ట్ చెయ్యకుండా స్కిప్ చేసే వారిలో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని మెదడు చురుకుదనం తగ్గుతుందని ఎప్పుడు మూడు స్వింగ్స్ ఉంటాయని చెబుతున్నారు. హార్మోనల్ సమస్యలు పెరిగి, మైగ్రేన్ సమస్యతో బాధపడే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక ప్రతిరోజు అల్పాహారం తీసుకోకుండా స్కిప్ చేసేవారు మధుమేహం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అనేక రోగాలకు స్వాగతం పలికే ఈ చెడ్డ అలవాటును మార్చుకుంటే మంచిదని, కచ్చితంగా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.
-
"దొండకాయ పకోడీ" అంటే ఆ హీరోయిన్కి అంత ఇష్టమా.. ఎలా చేయాలంటే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications