TB: టీబీ ఎలా వస్తుంది.. వస్తే ఏం చేయాలి.. వైద్యులు ఏం చెబుతున్నారు..
దేశంలో సైలెంట్ గా టీబీ విస్తరిస్తోంది. క్షయ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా భారత్ లోనే ఉన్నారట. దీన్ని అస్సలే లైట్ తీసుకోవద్దని వైద్యులు చెబుతున్నారు. ఈ టీబీ ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించింది.మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా టీబీ వస్తుంది. ఇది ప్రధానంగా ఊపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా ఒక్కోసారి మూత్రపిండాలు, వెన్నెముక, మెదడు, గర్భాశం వంటి కీలక అవయవాలను కూడా దెబ్బతీస్తుంది.

ప్రతి సెకనుకు ఒకరికి
దేశంలో ప్రతి సెకనుకు ఒకరికి టీబీ వ్యాధి వస్తోందట. రోజూ దేశంలో 1000 మంది క్షయ వ్యాధితో చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఒక్క తెలంగాణలోనే 72,674 టీబీ కేసులు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన మహమ్మారిపై 2030 నాటికి విజయం సాధించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో ) కూడా లక్ష్యాన్ని పెట్టుకుంది.ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా మార్చి 24న ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నారు.

ట్యూబర్క్యూలోసిస్
మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాపిస్తుంది. టీబీ పేషెంట్స్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ఈ వ్యాధి ఇతరులకు సోకుతుంది. టీబీ వచ్చిన వారికి విపరీతమైన దగ్గుతో పాటు జ్వరం వస్తుంది. ఛాతిలో నొప్పి, తలనొప్పి, నీరసం, అలసట, ఆకలి, బరువు తగ్గడం, ప్రధానంగా సాయంత్రం అవ్వగానే చలేస్తుండటం , రాత్రి వేళలో చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఏళ్ల తరబడి
టీబీ సోకిన వెంటనే వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వారిలో బ్యాక్టీరియా సోకిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు బయటికి కనిపిస్తాియ. మరికొందరిలో ఏళ్ల తరబడి బాక్టీరియా ఉండిపోయి, ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. కానీ, వ్యాధి సోకిన రెండు నుంచి ఐదేండ్ల లోపు వ్యాధి లక్షణాలు
పెరుగుతాయిట.

తెమడ పరీక్ష
టీబీ నిర్ధారణ కోసం తెమడ పరీక్ష చేస్తారు. ఛాతి ఎక్స్-రే, ల్యాటెంట్ టీబీ విషయంలో కొన్నిసార్లు చర్మం పరీక్ష, దేహంలో టీబీ సూక్ష్మక్రిమిని నిర్ధారణ చేసే న్యూరలాజికల్ పరీక్షలు కూడా చేస్తారు. హెచ్ఐవీ పేషెంట్లు, డయాబెటిస్ మెల్లిటస్, పోషకాహార లోపం ఉన్నవారిలో, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిలో, కిడ్నీ మార్పిడి తర్వాత, కరోనా వైరస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులున్న రోగులు, క్యాన్సర్ కీమోథెరపీలో ఉన్న రోగులకు టీబీ ఎక్కువగా సోకుతోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

కనీసం 6 నెలలు
టీబీకి సరైన చికిత్స అందుబాటులోకి వచ్చింది క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. కొన్ని రోజులు మందులు వాడగానే లక్షణాలు తగ్గిపోయాయని మందులు వాడటం ఆపేస్తుంటారు. వారిలో మందులకు లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది. ఇలాంటి వారికి ముందు ఇచ్చిన మందులకు బదులుగా ఇంకా ప్రభావంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుందని వైద్యులు వివరిస్తున్నారు. టీబీ కోర్సు కనీసం 6 నెలలు వాడాల్సి ఉంటుందని చెబుతున్నారు.
-
తెలుగులో ప్రింటు ఖర్చులు కూడా రాలేదుగా అన్నా.. -
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!!












Click it and Unblock the Notifications