Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షుగర్ పేషెంట్లకు మతిమరపు! పరిశోధనలో తేలిన నగ్న సత్యాలు..

డయాబెటిస్ అంటే కేవలం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడమే కాదు.. అది మెదడు పనితీరుపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా 'టైప్-1' డయాబెటిస్‌తో బాధపడేవారికి భవిష్యత్తులో డిమెన్షియా (మతిమరుపు వ్యాధి) వచ్చే ప్రమాదం సాధారణ వ్యక్తుల కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ న్యూరాలజీకి చెందిన 'న్యూరాలజీ' పత్రికలో ప్రచురితమైన ఈ అధ్యయనం ఇప్పుడు వైద్య లోకంలో చర్చనీయాంశమైంది.

బోస్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జెన్నిఫర్ వీవ్ నేతృత్వంలో సుమారు 2.83 లక్షల మందిపై ఈ సుదీర్ఘ అధ్యయనం జరిగింది. ఇందులో పాల్గొన్న వారి ఆరోగ్య రికార్డులను పరిశీలించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి..

Type 1 Diabetes Warning Researchers Find Strong Link Between High Blood Sugar and Increased Dementia Risk
  • టైప్-1 డయాబెటిస్: ఈ రోగులకు డిమెన్షియా వచ్చే అవకాశం ఇతరుల కంటే 3 రెట్లు ఎక్కువ.
  • టైప్-2 డయాబెటిస్: వీరికి ఈ ప్రమాదం దాదాపు రెట్టింపు (2 రెట్లు) ఉంది.

గణాంకాల ప్రకారం, డయాబెటిస్ లేని వారిలో కేవలం 0.6% మందికి మాత్రమే డిమెన్షియా రాగా, టైప్-1 బాధితుల్లో అది 2.6% గా నమోదైంది.

ChatGPT Health : మీ ఆరోగ్యం ఇక ఏఐ చేతిలో గోప్యంగా.
ChatGPT Health : మీ ఆరోగ్యం ఇక ఏఐ చేతిలో గోప్యంగా.

ఎందుకింత ప్రమాదం?

వైద్య సంరక్షణ మెరుగుపడటంతో టైప్-1 డయాబెటిస్ ఉన్నవారు ఇప్పుడు ఎక్కువ కాలం జీవించగలుగుతున్నారు. అయితే, వయస్సు పెరుగుతున్న కొద్దీ వారిలో మెదడు సంబంధిత సమస్యలు (Cognitive decline) తలెత్తుతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. టైప్-1 అనేది అరుదైన వ్యాధి (మొత్తం డయాబెటిస్ కేసుల్లో 5% మాత్రమే) అయినప్పటికీ, దీని ప్రభావం మెదడుపై చాలా బలంగా ఉంటోందని డాక్టర్ జెన్నిఫర్ వివరించారు. ఈ వ్యాధికి సంబంధించిన 65% డిమెన్షియా కేసులను నేరుగా డయాబెటిస్‌కే ఆపాదించవచ్చని ఆమె పేర్కొన్నారు.

అందరికీ హెల్త్ ప్రొఫైల్! వైద్యరంగంలో 'తెలంగాణ రైజింగ్'
అందరికీ హెల్త్ ప్రొఫైల్! వైద్యరంగంలో 'తెలంగాణ రైజింగ్'

ముందు జాగ్రత్తే మార్గం

ఈ అధ్యయనం కేవలం డయాబెటిస్ మరియు డిమెన్షియా మధ్య ఉన్న సంబంధాన్ని మాత్రమే చూపించింది తప్ప, ఒకదానికి ఒకటి కారణమని శాస్త్రీయంగా ఇంకా పూర్తిగా నిరూపించలేదు. అయినప్పటికీ, 65 ఏళ్లు పైబడిన డయాబెటిస్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో, మతిమరుపు వ్యాధిని నివారించడానికి లేదా ఆలస్యం చేయడానికి కొత్త మార్గాలను అన్వేషించడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోవచ్చని ఈ ఫలితాలు నొక్కి చెబుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+