రేపు అరుదైన అమావాస్య- ఈ క్రతువులతో..!!
ఈ నెల 24వ తేదీన ఆది అమావాస్య. పితృ తర్పణం, పవిత్ర స్నానాలు, దానధర్మాలు చేయడానికి దీన్ని అత్యంత పవిత్రమైన సందర్భంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల పితృ దేవతలు సంపూర్ణాశీస్సులు మనపై ఉంటాయని కోట్లాదిమంది హిందువుల ప్రగాఢ విశ్వాసం.
హిందూ మతంలో ఆడి అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాల్లో దీనిని విశేషంగా జరుపుకుంటారు. తమిళ మాసం ఆడిలో వచ్చే ఈ రోజు పూర్వీకులను స్మరించుకుంటూ, కుటుంబ శ్రేయస్సు కోసం వారి ఆశీస్సులు కోరుకునేందుకు ప్రత్యేకమైనది.

ఈ రోజున చేసే క్రతువులో మన పూర్వీకులు, పితృ దేవతల నుంచి ఆశీస్సులు లభిస్తాయనే విశ్వాసం ఉంది. ఆడి అమావాస్య రోజున సూర్యోదయం నుండి అమావాస్య తిథి ముగిసే వరకు పితృ తర్పణం, ఇతర కార్యక్రమాలు చేయడానికి చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు.
జూలై 24 తెల్లవారు జామున 2:29 నుండి జూలై 25, 2025 తెల్లవారుజామున అర్ధరాత్రి 12:41 నిమిషాల వరకు అమావాస్య తిథి ఉంటుంది. ఆడి అమావాస్య పితృ దేవతలను పూజించడానికి, శుద్ధి చేసుకోవడానికి, ఆధ్యాత్మికంగా నూతన ఉత్తేజాన్ని నింపుకోవడానికి అనుకూలమైన సమయంగా భావిస్తారు.
ఈ సమయంలో సూర్యుడు దక్షిణ దిశగా పయనించడం ప్రారంభిస్తాడు. దీనినే దక్షిణాయనం అంటారు. ఈ కాలంలో చేసే ప్రార్థనలు, సమర్పణలకు కాస్మిక్ శక్తులు అనుకూలంగా ఉంటాయని నమ్ముతారు. ఈ రోజున భక్తులు నదులు లేదా సముద్రాలలో పవిత్ర స్నానాలు చేస్తారు. నువ్వులు, నీరు, బియ్యంతో తర్పణం చేస్తారు. తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం ప్రార్థిస్తారు.
ఆడి అమావాస్య రోజున ప్రార్థనలు చేయడం వల్ల పూర్వీకుల ఆత్మలకు శాంతి కలగడమే కాకుండా, కుటుంబ సభ్యులకు శ్రేయస్సు, రక్షణ, ఆశీర్వాదం లభిస్తాయని విశ్వసిస్తారు. గత కర్మలను వదిలించుకోవడానికి, దైవిక మార్గదర్శకత్వం పొందడానికి, ఆధ్యాత్మికంగా కొత్తగా ప్రారంభించడానికి ఇది ఒక మంచి రోజు.
ఆడి అమావాస్య రోజున భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి నదులు, సరస్సులు లేదా సముద్రంలో పవిత్ర స్నానం చేస్తారు. రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయడం చాలా శ్రేష్ఠమని భావిస్తారు. పురుషులు వేద మంత్రాలు చదువుతూ నీరు, నువ్వులు, వండిన అన్నం పూర్వీకులకు సమర్పిస్తారు.
పేదవారికి లేదా బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారు. దీని ద్వారా పూర్వీకులకు పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. చాలామంది శివాలయాలను లేదా వారి కుటుంబ దేవాలయాలను సందర్శించి దేవుడి ఆశీస్సులు పొందుతారు. ఇంట్లో దీపాలు వెలిగించి, ప్రతికూలతను తొలగించడానికి, దైవిక అనుగ్రహం కోసం ప్రార్థనలు చేస్తారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications