144 ఏళ్ల తర్వాత ఈ రాశులకు అఖండ ధనయోగాన్ని ప్రసాదించిన కుంభమేళా
ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుందనే సంగతి తెలిసిందే. 2025 జనవరి 13వ తేదీ నుంచి 2026 ఫిబ్రవరి 26 వరకు ప్రయాగలో పూర్ణ మహా కుంభమేళా జరుగుతోంది. 144 సంవత్సరాల తర్వాత మాత్రమే ఇలాంటి అరుదైన సంఘటనకు ఆస్కారం ఏర్పడిందని పండితులు తెలియజేస్తున్నారు. గృహం, తిథి, యోగలగ్నం అన్నీ అనుకూలంగా ఉంటే అది అరుదైనది అవుతుంది. 2025 సంవత్సరాన్ని లెక్కిస్తే 9 వస్తుంది. 144 కూడినా 9 వస్తుంది. ఆరో సంవత్సరంలో అర్థ కుంభమేళా, 12వ సంవత్సరంలో మహా కుంభమేళా, 144 సంవత్సరాల తర్వాత పూర్ణ మహా కుంభమేళా జరుగుతోంది.
సూర్యుడు మకర రాశిలోకి
దేవతలకు గురువైన బృహస్పతి శుక్రుడి సొంత రాశి అయిన వృషభరాశిలో సంచరిస్తున్న సమయంలో సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. బృహస్పతి 12 రాశుల్లో ప్రయాణించిన తర్వాత వృషభరాశిలోకి వచ్చిన తరుణంలో ప్రతి 12 సంవత్సరాలకు మహా కుంభమేళా జరుగుతుంది. ఆయన ఇదే రాశిలో చేసిన సంచారం మొత్తం 12 చక్రాలు పూర్తయితే దాన్ని పూర్ణ మహాకుంభం అంటారు. వచ్చే ఏడాది మే 14 వరకు ఉంటుంది. చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే న్యాయదేవత అయిన శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 29వ తేదీన మీనరాశిలోకి ప్రవేశిస్తాడు.

ఐదు మహా పురుష్ యోగాలు
బృహస్పతి మీనరాశికి అధిపతి కావడంతో రాశిచక్రం మారుతుంది. బుధాదిత్య యోగం, గురుదిత్య యోగం, గజకేసరి యోగం, శష్ యోగం, మాలవ్య రాజయోగం అనే ఐదు మహా పురుష్ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ యోగాలవల్ల అన్ని రాశులవారు మహర్జాతకులయ్యారు. అన్ని విధాలుగా వీరికి కలిసివస్తుంది. పూర్ణ మహాకుంభమేళాలో స్నానం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది. క్షీరసాగర మథనం చిలికినప్పుడు అమృతం భూమి మీద కొన్ని చుక్కలు పడ్డాయి. అవి నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ, హరిద్వార్ లో పడ్డాయి. ఈ చుక్కలు ఎక్కడ పడితే అక్కడ కుంభం నిర్వహించారు. జగద్గురు ఆది శంకరాచార్యులు 850 సంవత్సరాల క్రితం కుంభమేళాలను ప్రారంభించారు.












Click it and Unblock the Notifications