బుద్ధపూర్ణిమ.. ఈ రాశులవారికి డబ్బు వర్షం
హిందూ సాంప్రదాయంలో ప్రతి నెల చివరి తేదీని పూర్ణిమ తిథిగా భావిస్తారు. ఆరోజు స్నానం చేయడం, దానధర్మాల్లాంటివాటివల్ల మనిషికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వైశాఖ మాసంలో మే 5వ తేదీన పౌర్ణమి చేస్తారు. గౌతమ బుద్ధుడు వైశాఖ పూర్ణిమ రోజున జన్మించాడు. ఆరోజు బుద్ధపూర్ణిమ కూడా చేస్తారు. అదేరోజు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 130 సంవత్సరాల తర్వాత ఈ యోగం రాబోతుందని పండితులు అంటున్నారు. కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉండటమే కాకుండా ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది. డబ్బు, సంపద, కీర్తి, అదృష్టం పొందుతారు. ఆ రాశులవారు ఎవరెవరనేది తెలుసుకుందాం.
మేష రాశి : బుద్ధ పూర్ణిమ రోజు మేష రాశిలో సూర్యుడు సంచరిస్తూ బుధ గ్రహంతో కలిసి ఉంటాడు. దీనివల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. మేషరాశివారికి ఇలా ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. సంపదలో పెరుగుదల, ఉద్యోగం మారాలని ఆలోచించేవారికి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలను పొందుతారు.
కర్కాటక రాశి : ఈ రాశివారుఅనుకూల ఫలితాలు పొందుతారు. వ్యాపారంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందడమే కాకుండా కెరీర్లో భారీ విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో పదోన్నతి వస్తుంది. అదృష్టం ఉంటుంది. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్నట్లయితే..మీరు కోరుకున్న ప్రదేశంలో బదిలీ పొందుతారు.
సింహ రాశి : సింహరాశివారికి బుధాదిత్య యోగం లాభాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులు పదోన్నతి పొందడంతోపాటు జీవితంలో ఆనందాన్నిచవిచూస్తారు. జీవిత భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అవకాశాలు లభించడంతోపాటు వ్యాపారంలో లాభాలను పొందుతారు. ఒకరకంగా డబ్బు వర్షం కురుస్తుందని చెప్పవచ్చు.