సెప్టెంబరు 10 నుంచి ఈ రాశులపై వరాల జల్లు
చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదించే శనిదేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తుంటాడు. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శనిదేవుడు.. సప్తమ స్థానమైన కన్యారాశిలోకి సూర్యుడు రావడంవల్ల అతివక్రం అవుతాడు. ఇలా 75 రోజులు కొనసాగుతుంది. ఈ సమయంలో కొన్ని రాశులకు మంచి ఫలితాలు కలుగుతాయి. కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం.
వృశ్చిక రాశి
కోరికలన్నీ నెరవేరతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. పిల్లలు పుట్టనివారికి పిల్లలు కలుగుతారు. సమాజంలో మంచి గౌరవాన్ని ఉద్యోగులు పొందుతారు. విహార యాత్రలకు వెళతారు.

మకర రాశి
ఆరోగ్యం బాగుంటుంది. కొన్నాళ్లుగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఇది మంచి సమయం. ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది.
మిథున రాశి
ఉద్యోగంలో మంచి ఫలితాలు కలుగుతాయి. కొందరికి పదోన్నతులున్నాయి. తండ్రివైపు నుంచి ఆస్తులు కలిసివస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తులు వచ్చే అవకాశం ఉంది.
వృషభ రాశి
అనారోగ్య సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి. విదేశాల్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. సమస్యల నుంచి బయటపడతారు. శనిదేవుడి సంచారం వీరికి ధనయోగాన్ని తెస్తుంది. వ్యాపారస్తులకు బాగుంటుంది.
కర్కాటక రాశి
ఎప్పటి నుంచో కలలు కంటున్న సొంతింటి కల నెరవేరుతుంది. కోర్టు కేసులన్నీ పరిష్కారమవుతాయి. ఆర్థికంగా మంచి వృద్ధి ఉటుంది. లాభాలు కూడా వ్యాపారస్తులకు వారు ఊహించినరీతిలోనే వస్తాయి.












Click it and Unblock the Notifications