29న ధన త్రయోదశి... ఈ ఒక్కటి కొనండి.. రాశులవారంతా కుబేరులే
ఈనెల 31వ తేదీన దీపావళిని జరుపుకుంటున్నాం. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటాం. కొందరు నవంబరు ఒకటోతేదీన కూడా జరుపుకుంటున్నారు. ఆరోజు ఉదయం అమావాస్య ఉండటమే ఇందుకు కారణం. పండగకు రెండురోజుల ముందు ధనత్రయోదశి వస్తుంది. ఆరోజులు చాలామంది బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు. దీంతోపాటు మరికొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే అఖండమైన సంపద కలుగుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
అక్టోబరు 29న ధన త్రయోదశి, 30న నరక చతుర్ధవి, 31న దీపావళి ఉన్నాయి. ధన త్రయోదశి రోజు కొంతైన బంగారం కొనుగోలు చేయాలని చెబుతారు. దీనివల్ల రోజురోజుకు సంపద పెరుగుతుందని నమ్ముతారు. అలాగే ధనత్రయోదశి రోజు చీపురు తీసుకొస్తే ఇంటికి ఎంతో మంచిది. అలాగే వెండి వస్తువులు లక్ష్మీదేవికి సంబంధించినవి కొనుగోలు చేసినా మంచి జరుగుతుంది. అలాగే కొత్తగా వాహనాలతోపాటు ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోలు చేసినా మంచే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఆరోజు రెండు ఏనుగులు ఉన్న లక్ష్మీదేవి ఫొటోను ఇంటికి తెచ్చుకుంటే ఎంతో కలిసివస్తుంది. ఏనుగులు లక్ష్మీదేవి పక్కనే ఉండి విఘ్నాలను తొలగించడానికి సహాయపడతాయి. తాబేలు ప్రతిమ, తామరపువ్వును ఇంటికి తీసుకువస్తే ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది. ఇలాంటివన్నీ కొనుగోలు చేయడంవల్ల జీవితంలో ఊహించనిరీతిలో మార్పులు వస్తాయని జ్యోతిష్య పండితులు తెలిపారు. క్షీరసాగరాన్ని మథించే సమయంలో శ్రీ మహావిష్ణువు అంశగా అమృత కలశ హస్తుడై ఆవిర్భవించాడు ధన్వంతరి. సమస్త ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడానికే ఆయన పుట్టుక జరిగింది. ఆయన జన్మించిన ఆశ్వయుజ బహుళ త్రయోదశిని హిందువులు ధన త్రయోదశిగా జరుపుకుంటారు.












Click it and Unblock the Notifications