Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్ పాక్ ఉద్రిక్తత.. మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా? బాబా వంగా షాకింగ్ ప్రిడిక్షన్!

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ సిందూర్ పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ సరిహద్దులలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఇక భారత్ చర్యకు ప్రతి చర్యగా సరిహద్దులలో పాకిస్తాన్ సైన్యం కాల్పులు కొనసాగిస్తోంది. దీనికి భారత్ దీటుగా సమాధానం చెబుతోంది.

భారత్ పాక్ ల యుద్ధం.. బాబా వంగా ఏమన్నారంటే
ఇదే సమయంలో భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం జరుగుతుందా? ఒకవేళ యుద్ధం జరిగితే ఏ దేశం గెలుస్తుంది? భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం ముందు ముందు మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా కారణం అవుతుందా? వంటి అనేక ప్రశ్నలు చాలామందిలో ఉత్పన్నమవుతున్నాయి. ఇక దీనిపైన ప్రఖ్యాత బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగ గతంలోనే చెప్పిన ప్రొడక్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

India-Pakistan tension will it lead to third world war Baba Vanga Shocking Prediction

Take a Poll

2025 సంవత్సరంలో పెద్ద యుద్ధం
ప్రముఖ బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలను, యుద్ధ వాతావరణం అన్ని ముందే ఊహించారు. ఇటీవల న్యూయార్క్ పోస్ట్ నివేదికలో గతంలో బాబా వంగ మూడవ ప్రపంచ యుద్ధం పైన చేసిన ఒక ప్రిడిక్షన్ పోస్ట్ చేశారు. అందులో బాబా వంగ 2025 సంవత్సరంలో పెద్ద యుద్ధం వస్తే అది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల సమస్యలకు దారితీస్తుందని పేర్కొన్నారు.

యూరప్ పునాదులను కదిలించే ఒక పెద్ద ఘర్షణ
ప్రపంచవ్యాప్తంగా 2025 సంవత్సరంలో జరిగే ఘర్షణల వల్ల ప్రకృతి కూడా అస్తవ్యస్తంగా మారే అవకాశం ఉందని, యుద్ధాల కారణంగా విధ్వంసకరమైన భూకంపాలు వస్తాయని పేర్కొన్నారు. ముఖ్యంగా యూరప్ పునాదులను కదిలించే ఒక పెద్ద ఘర్షణ జరుగుతుందని బాబా వంగ వివరించారు. అయితే ఘర్షణకు సంబంధించిన వివరాలు తెలిపిన ఆమె ఏ ఏ దేశాల మధ్య ఘర్షణ జరగబోతుంది అనేది మాత్రం పేర్కొనలేదు.

భారీగా ప్రకృతి విపత్తులు వచ్చే అవకాశం
ఇప్పటికే బాబా వంగ ప్రిడిక్షన్ ప్రకారం 2025 సంవత్సరం మయన్మార్లో దాదాపు 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ఘటనలో భాగంగా 1700 మంది కి పైగా ప్రాణాలు కోల్పోయారు కొన్ని లక్షల మంది గాయపడ్డారు. ఇక బాబా వంగ జ్యోతిష్య అంచనా ప్రకారం ఈ సంవత్సరంలో యుద్ధాలు జరిగితే ఆ తర్వాత భారీగా ప్రకృతి విపత్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందా?
కొన్ని ప్రాంతాలలో ప్రకృతి విలయతాండవం చేస్తుందని తెలిపారు. గతంలో ఆమె చేసిన జ్యోతిష్య అంచనాలు చాలా వరకు నిజమైన నేపథ్యంలో ఇప్పుడు భారత్ పాకిస్తాన్ల మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు భవిష్యత్తులో ఎటువంటి పరిణామాలను కలిగిస్తాయి అన్నది అందరిలోనూ ఆందోళన కలిగిస్తుంది భారత్ పాకిస్తాన్ల మధ్య జరుగుతున్న యుద్ధం మూడవ ప్రపంచ యుద్ధానికి కారణం అవుతుందా అన్నది ముందు ముందు తెలియాల్సి ఉంది.

disclaimer: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+